పార్టీలో క్రమశిక్షణ తప్పుతోంది: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

పార్టీలో క్రమశిక్షణ తప్పుతోంది: చంద్రబాబు

Published Wed, May 24 2017 1:00 PM

AP CM warning to TDP leaders on criticising BJP

అమరావతి: పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన కనిపిస్తోందని.. ఇక దానిని ఉపేక్షించేది లేదని, అలాంటివారిపై వేటు వేస్తామని, కనీసం విచారణ కూడా జరపమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని చెప్పారు.
 
పత్తికొండ హత్యలో వాస్తవాలు ప్రజలకు చెబుతామని, గత చరిత్రే వారిని వెంటాడుతుందన్నారు. అద్దంకి వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై కూడా  చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement