ఫైనల్లో సానియా జంట | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జంట

Published Sat, Oct 3 2015 1:09 AM

ఫైనల్లో సానియా జంట

న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది పదో టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలోని వుహాన్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజ యం సాధించింది.

53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ఇ రీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీతో సానియా-హింగిస్ తలపడతారు.
 

Advertisement
Advertisement