క్వార్టర్స్లోనే వెనుదిరిగిన సైనా నెహ్వాల్ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లోనే వెనుదిరిగిన సైనా నెహ్వాల్

Published Sat, Oct 25 2014 3:06 PM

క్వార్టర్స్లోనే వెనుదిరిగిన సైనా నెహ్వాల్

దాదాపు కోటీ 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్లో భారత పోరాటం ముగిసింది. టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి చైనా అడ్డుగోడను దాటలేక వెనుదిరిగింది. సైనా.. క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన రెండో సీడెడ్ క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్స్లో కాంస్యపతకం సాధించిన సైనా.. గంటా పది నిమిషాల పాటు సాగిన సుదీర్ఘంగా ఈ మ్యాచ్లో గట్టిగా పోరాడింది.

కానీ, చివరకు 19-21, 21-19, 15-21 తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో సైనా నెహ్వాల్పై షిసియాన్ మొత్తం ఐదు సార్లు పోటీ పడగా, అన్నిసార్లూ ఆమే గెలిచినట్లయింది. మహిళల సింగిల్స్లో సెమీస్ స్థాయిలో నలుగురు పోటీ పడుతుంటే వాళ్లలో ముగ్గురు చైనా షట్లర్లే కావడం గమనార్హం. ఒలింపిక్ ఛాంపియన్ లీ జూరుయ్, మాజీ ప్రపంచ ఛాంపియన్ వాంగ్ ఇహాన్ ఇద్దరూ క్వార్టర్స్లో సులభంగా నెగ్గారు.

Advertisement
Advertisement