తిరుష్ కామిని శ్రమ వృథా
బెంగళూరు: తొలి వన్డేల్లో సమష్టిగా రాణించి విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్లో మాత్రం తడబడింది. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.
తిరుష్ కామిని (96 బంతుల్లో 61; 11 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించారు. ఏక్తా బిస్త్ (18 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. సృ్మతి మందన (12)తో కలిసి కామిని తొలి వికెట్కు 33; కెప్టెన్ మిథాలీ రాజ్(13)తో కలిసి రెండో వికెట్కు 35 పరుగులు జోడించింది. తర్వాత కివీస్ 44.2 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి నెగ్గింది.
డివైన్ (33), పెర్కిన్స్ (30), సట్టెర్త్వైట్ (23), అన్నా పీటర్సన్ (23 నాటౌట్), ప్రీస్ట్ (21) రాణించారు. తక్కువ స్కోరును కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసినా... డివైన్, పెర్కిన్స్లు ఐదో వికెట్కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. తర్వాత కాస్పారెక్, పీటర్సన్ ఎనిమిదో వికెట్కు 32 పరుగులు జోడించడంతో కివీస్ విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాజేశ్వరి రెండేసి వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.
రెండో వన్డేలో భారత్ ఓటమి
Published Thu, Jul 2 2015 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement