బెంగుళూరు: వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాలు ఓ టీచర్ ప్రాణాలు తీశాయి. ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్ సునంద(50)పై ఓ వ్యక్తి కిరోసిన్ పోశాడు. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమెపై వెంట తెచ్చుకున్న డబ్బాలోని కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
ఈ ఘటన బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. టీచర్ మంటల్లో కాలిపోతే కేకలు వేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు నిర్ఘాంతపోయారు. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఘటనాస్ధలికి చేరుకున్న ఇతర టీచర్లు సునందను ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవరాం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సునంద ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రూంలోకి వచ్చిన ఓ వ్యక్తి.. సునందను గద్దించి మాట్లాడినట్లు చెప్పారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు.
సునంద అతన్ని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలిపారు. అతను వెంట తెచ్చుకున్న డబ్బాను తెరిచి సునందపై కిరోసిన్ పోసి నిప్పంటిచినట్లు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
క్లాస్రూంలో విద్యార్థుల ముందు..
Published Thu, Aug 17 2017 10:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement