సాలెం(తమిళనాడు): నిర్మాణంలో ఉన్న ఓ స్కూలు బిల్డింగ్నుంచి జారిపడి మృతిచెందిన బాలుడి మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు తిరస్కరించారు. తమ కుమారుడి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని సాలెం నగరంలో చోటుచేసుకుంది. వివరాలవి... 13ఏళ్ల వయస్సు ఉన్న ఓ విద్యార్థి సాలెంలోని రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. నివాస ప్రాంతానికి 27కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లిన విద్యార్థి స్కూల్ ఆభరణంలో నిర్మాణ పనులు జరుగుతున్న కొత్త బిల్డింగ్పైకి ఒంటరిగా వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన బాలుడు అపస్మారక స్థితిలో వెళ్లడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే బాలుడు మృతిచెందినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. దాంతో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వెళ్లగా బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీసుకునేందుకు తిరస్కరించారు. అంతేకాక తమ కుమారుడి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు మృతిచెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. కుమారుడి ఒంటిరిగా వెళ్లనిచ్చిన స్కూలు టీచర్లు, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకునేందుకు అంగీకరించారు. దాంతో పోలీసులు ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.
బాలుడి మృతదేహాన్ని తిరస్కరించిన తల్లిదండ్రులు
Published Sun, Mar 1 2015 8:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement