అస్సాం-నాగాలాండ్ల మధ్య కుదిరిన ఒప్పందం
కేంద్ర హోం శాఖ చొరవతో ఉన్నతస్థాయి కమిటీ
గువాహటి: అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. సమస్యలు పరిష్కరించుకోవటానికి రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా ఒక ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జీలంగ్లతో గురువారం సమావేశమయ్యారు.
అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమవుతూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సరిహద్దుల్లో తటస్థ బలగాలను మోహరించేందుకు యోచిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రులు ఎప్పుడు కోరినా కేంద్రం నుంచి తగిన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉరియమ్ఘాట్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలు తగిన విధంగా విధులు నిర్వర్తించలేదన్న గొగోయ్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, నిర్దిష్ట విధి విధానాలను కేంద్ర బలగాలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్య తీసుకుంటామన్నారు.
మౌలిక వసతులే సమస్య
సరిహద్దుల్లో వివాదానికి ప్రధాన కారణం ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటమేనని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు వంటి కీలకమైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి కావటానికి తగిన నిధులు అవసరమని ఆయన చెప్పారు. ఇందుకోసం తాము కేంద్ర సహాయాన్ని అర్థిస్తున్నామని గొగోయ్ అన్నారు. మరోవైపు.. అస్సాం, నాగాలాండ్ సమస్య ప్రభావం ఈశాన్య రాష్ట్రాలన్నింటిపైనా పడుతోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు.
కర్ఫ్యూ సడలింపు
గోల్ఘాట్(అస్సాం): సరిహద్దుల వివాదాలతో ఉద్రిక్తతలు నెలకొన్న గోల్ఘాట్లో గురువారం సాయంత్రం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు ప్రకటించారు. సరిహద్దుల దగ్గర ఆందోళన చేస్తున్న 7 సంస్థలు తమ నిరవధిక ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గురువారం పూర్తి కర్ఫ్యూ ఉన్నప్పటికీ నుమాలీఘర్ దగ్గర 39వ నెంబరు జాతీయరహదారి పై నిరసన కారులు బైఠాయించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
శాంతి కోసం ఉమ్మడి యంత్రాంగం
Published Fri, Aug 22 2014 3:47 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement