ప్రణయం ప్రళయమైతే... | Sakshi
Sakshi News home page

ప్రణయం ప్రళయమైతే...

Published Fri, Mar 27 2015 11:57 PM

ప్రణయం ప్రళయమైతే...

 ఎన్నో యుద్ధాలు, ప్రళయాలు మనిషి వల్లే ఇప్పటిదాకా సంభవించాయి. స్త్రీ, పురుష సంబంధాలకు ఇదే వర్తిస్తుందన్న కథాంశంతో హుద్‌హుద్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేశ్ ముఖ్యతారలుగా  శ్రావ్య ఫిలింస్ పతాక ంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన  ఈ చిత్రానికి పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.  దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘సెన్సార్ పూర్తయింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మాస్‌ని, క్లాస్‌ని  ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య.
 

Advertisement
Advertisement