భరత్ పూర్: నేపాల్ రాజధాని ఖాట్మండుకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు 61 మంది నేపాల్ భూకంపంలో చిక్కుకున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న సందీప్ రెడ్డి తన తల్లిదండ్రులకు ఫొన్ చేసి విషయం తెలపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే వీరిలో ఎంతమంది సురక్షితంగా ఉన్నారన్న వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.