- ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ మండిపాటు
- ప్రాజెక్టులపై అపోహలు సృష్టిస్తున్నారు
- కర్ణాటకలో ఆలమట్టి కోసం 22 గ్రామాలు ముంచుతున్నారు
- దీనిపై జైపాల్రెడ్డి మాట్లాడరేమి?
- భూసేకరణపై టీడీపీది ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట
- 2018 నాటికి మల్లన్నసాగర్ పూర్తి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలంతా ఒక వైపు ఉంటే, ప్రతిపక్షాలు మరొక వైపు ఉన్నాయి. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టే పనిలో ఉన్నాయి. ప్రాజెక్టులపై అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నాయి’’ అని సాగునీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింత ప్రభాకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘‘అసలు ప్రతిపక్షాల సమస్య ఏంటి? వీళ్లు సమైక్య రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులను పట్టించుకోక తెలంగాణను ఎండబెట్టారు.
వారి పాపం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయి’’ అని హరీశ్ అన్నారు. ప్రజలను మెప్పించి, ఒప్పించి భూసేకరణ జరిపి ప్రాజెక్టులు కడతామని స్పష్టంచేశారు. ‘‘ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే తప్పులు బయట పడిపోతాయని, తలవంచుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సభ నుంచి వెళ్లిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలవి రెండు నాల్కల ధోరణి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం కోసం 22 గ్రామాలను, 1.20 లక్షల ఎకరాలను ముంచుతున్నారు. దేశం మొత్తంలో ఏ ప్రాజెక్టు కింద ఇంత ముంపు లేదు. జాతీయ నాయకుడైన జైపాల్రెడ్డి దీనిపై స్పందించాలి’’ అని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ తోడు దొంగలు
టీడీపీ గల్లీలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటుందని, ఢిల్లీలో మాత్రం రద్దు చేయాలంటోందని హరీశ్ పేర్కొన్నారు. ‘‘ఏపీలో రైతుల నుంచి టీడీపీ బలవంతంగా భూములు లాక్కోలేదా? అమరావతి రాజధానికి 500 ఎకరాలు సరిపోతుంది. మరి 54 వేల ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నారు? అమరావతి రింగ్రోడ్డుకు 4,200 ఎకరాలు, గన్నవరం ఎయిర్పోర్టుకు 2,500 ఎకరాలు, మచిలీపట్నం పోర్టుకు 15 వేల ఎకరాలు, కాకినాడ సెజ్కు 6 వేల ఎకరాలు, నెల్లూరు సెజ్కు 12 వేల ఎకరాలు, దొనకొండ ఇండస్ట్రియల్ హబ్కు 28 వేల ఎకరాలు, వాన్పిక్ కోసం 16 వేల ఎకరాలు సేకరించలేదా? ఏపీ చేయొచ్చు కానీ.. బీడు భూములకు రెండు పంటలకు సాగునీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పా..? ఇక్కడ మాట్లాడే హక్కు టీడీపీకి ఉందా ? ఇది విధానమేనా? కాంగ్రెస్, టీడీపీ తోడు దొంగలు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే గతంలో కాంగ్రెస్ సేకరించిన భూములను రైతులకు వెనక్కి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, మరి ఇప్పుడు గంగవరం పోర్టు, కాకినాడ సెజ్, వాన్పిక్ భూములకు సంబంధించి ఎన్ని ఎకరాలు వాపస్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నందిగ్రామ్లో సీపీఎం చేసిందేమిటి.. అక్కడ భూసేకరణ కోసం 14 మంది రైతులను పొట్టన బెట్టుకోలేదా అని నిలదీశారు.
తక్కువ ముంపుతో కడతాం
అతి తక్కువ ముంపుతో ప్రాజెక్టులను రీ డిజైన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 50 టీఎంసీల రిజర్వాయర్ కోసం కేవలం 8 గ్రామాలే ముంపునకు గురవుతున్నాయన్నారు. కానీ గతంలో ఎల్లంపల్లిలో 20 టీఎంసీల కోసం 21 గ్రామాలు, మిడ్మానేరులో 28 టీఎంసీల కోసం 18 గ్రామాలు, పులిచింతల లో 45 టీఎంసీల కోసం 28 గ్రామాలు ముంచారన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డిలో 115 టీఎంసీల కోసం 32 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, తాము ఆ ప్రాజెక్టునే 92 టీఎంసీలతో కేవలం 6 గ్రామాలు, డిండిలో 23 టీఎంసీల రిజర్వాయర్తో 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురయ్యేలా రీ డిజైన్ చేశామన్నారు. ఏపీకి మూడో పంటకు నీరివ్వడానికి కాం గ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి దగ్గరుం డి పులిచింతల ప్రాజెక్టు కట్టించారని, ఈ ప్రాజెక్టులో మునిగేది తెలంగాణ, లబ్ధి పొందేది మాత్రం ఏపీ అన్నారు. జైపాల్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, విపక్షాలు ఇకనైనా రాష్ట్ర పునర్నిర్మాణానికి కలసి రావాలని హితవు పలికారు.
2018 నాటికి మల్లన్నసాగర్ పూర్తి
‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్న ప్రాజెక్టుకు కూడా నోచుకోని జిల్లా మెదక్. అందుకే మల్లన్న సాగర్ను తలపెట్టాం. 80శాతం సాగు, 10శాతం హైదరాబాద్కు తాగునీరు, 10శాతం పారిశ్రామిక అవసరాలకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును 2018 నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం’’ అని హరీశ్ చెప్పారు. 8 గ్రామాల్లో ఆరు గ్రామాలు ఇప్పటికే అంగీకరించాయని, మరో రెండు గ్రామాలను ఒప్పించే పనిలో ఉండగానే ప్రతిపక్షాలు కుట్ర చేశాయన్నారు. ఇక్కడ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్, సీపీఎంలు ఏపీలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు స్పందించడం లేదని, అక్కడ ఎందుకు ఉద్యమాలు చేయడం లేదని నిలదీశారు.
వారిది రెండు నాల్కల ధోరణి
Published Wed, Jul 27 2016 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement