సీఎం చంద్రబాబుకు ఎంపీ కేవీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తుకంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ముఖ్యమనేలా మహానాడులో తీర్మానాన్ని ఆమోదించాలని సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బుధవారం లేఖ రాశారు. మీ చతురత, ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థతను మీకోసం, మీ మనుషుల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం వాడాలన్నారు. లేఖలోని అంశాలివీ.. ‘ఈనెల 27 నుంచి జరిగే టీడీపీ మహానాడులో చేయనున్న తీర్మానాలు, పత్రికల్లో లీకైనవి చదివాను.. ప్రత్యేక హోదా అమలుకు ప్రతిపాదన కనిపించలేదు. రెండేళ్లయినా విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కాదా? ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో నేను ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్కు రాకుండా ఉభయసభలూ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం మీకు తెలుసు.
రానున్న సమావేశాల్లోనైనా ఈ బిల్లు ఓటింగ్కు వస్తుందని ఆశిస్తున్నాను. ఈలోగా ఏపీకి చెందిన అన్ని పార్టీలూ ఒక్క తాటిపైకి రావాల్సిన అనివార్యతను మీ దృష్టికి తెస్తున్నా. మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలం? వైఎస్సార్సీపీ, కాంగ్రెస్లతో ఎలా కలసి పని చేయగలం? అనే భేషజాలకు తావివ్వకుండా, విభజన హామీల అమలుకు అంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని పక్షాలతో ‘పరస్పర దూషణ విరమణ’ ఒప్పందం చేసుకోవాలి.’ అని లేఖలో కేవీపీ పేర్కొన్నారు.
‘హోదా’పై మహానాడులో తీర్మానం చేయండి
Published Thu, May 26 2016 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement