సోనియాపై బీజేపీకుట్ర | Sakshi
Sakshi News home page

సోనియాపై బీజేపీకుట్ర

Published Fri, Apr 29 2016 2:30 AM

సోనియాపై బీజేపీకుట్ర - Sakshi

ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అప్రతిష్టపాలు చేయడానికే బీజేపీ నేతలు ఆగస్టా కుంభకోణాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టా కుంభకోణం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఖండిస్తూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షపార్టీల నేతలను వేధించే సంప్రదాయం మంచిది కాదని హెచ్చరించారు.

ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి అండగా ఉంటామని సీఎల్పీ తీర్మానం చేసినట్లు పొంగులేటి చెప్పారు. పాలేరు ఉప ఎన్నిక ఉన్నప్పుడే ఖమ్మంలో ప్లీనరీని నిర్వహించిన టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement