శేషాచలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్ | Sakshi
Sakshi News home page

శేషాచలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్

Published Thu, Aug 25 2016 7:26 PM

Task Force police combing in sesacalam

శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ గురువారం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం కూలీలు ప్రవేశించారనే సమాచారంతో అటవీ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసిన ఎర్ర చందనం కూలీలు పరారయ్యారు. పరారైన కూలీలు 30 మందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు.  పరారైన కూలీలు తమ వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను వదిలేసి వెళ్లారని వివరించారు. వీటి విలువ మార్కెట్ లో రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు. 
 
 

Advertisement
Advertisement