మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల

Published Sat, Nov 21 2015 9:59 AM

మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల - Sakshi

ఖమ్మం: మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు విడుదలయ్యారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు.

శనివారం ఉదయం చత్తీస్ గడ్ సరిహద్దులో టీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టారు. టీఆర్ఎస్ నేతలు కాసేపట్లో ఖమ్మం జిల్లా చర్లకు చేరుకోనున్నారు. భద్రాచలం నియోజక వర్గ ఇంఛార్జి నూనె రామకృష్ణ, చర్ల , వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన  వెంకటేశ్వర్లు, సురేష్ , జనార్థన్, రామకృష్ణ, సత్యనారాయణలను ఈ నెల 18 న చర్ల మండలం కూసుగుప్ప లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement