కడప అర్బన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రజా రవాణా మనుగడకు ఏకైక మార్గమని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేయకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం లేదన్నారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజల అవసరాల కోసం నడుస్తున్న సంస్థ అని, లాభనష్టాలతో యాజమాన్యం మొదటి నుంచి బేరీజు వేయడం తప్పుడు ఆలోచన విధానమన్నారు. ప్రజా రవాణా అవసరాలను గమనించి అందుకు అనుగుణంగా సంస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 4 వర్క్షాపుల్లో ఈయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించామన్నారు. బుధవారం కూడా ఈ ధర్నాలు కొనసాగుతాయన్నారు. యాజమాన్యం అద్దె బస్సులను పెంచడం వల్ల సంస్థకు మరింత భారమవుతుందన్నారు. అద్దె బస్సులను పెంచడమే కాకుండా ఆ బస్సులకు ఆర్టీసీ కండక్టర్లను నియమించకుండా ప్రైవేటు డ్రైవర్లకే డబ్బులు వసూలు చేసే బాధ్యత అప్పగించడం యాజమాన్య వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు. ప్రయాణికులు లేరనే సాకుతో యాజమాన్యం ట్రిప్పులను తగ్గించడం ద్వారా ప్రైవేటు బస్సులు, లారీలు, ఆటోల అక్రమ రవాణాను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. అక్రమ రవాణాను నియంత్రించడం ద్వారానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు. యాజమాన్యం అద్దె బస్సులు, సింగిల్ క్రూ డ్యూటీలు, గ్రౌండ్ బుకింగ్స్, వన్మ్యాన్ సర్వీసుల వంటి తప్పుడు విధానాలను మానుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు యాజమాన్యం కూడా గట్టిగా కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం
Published Wed, Sep 28 2016 12:13 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement