ప్రేమజంట ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Published Sat, Feb 6 2016 9:54 AM

ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించపోవడమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement