బాస్కెట్‌బాల్‌ టోర్నీలో జిల్లాకు ద్వితీయ స్థానం | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ టోర్నీలో జిల్లాకు ద్వితీయ స్థానం

Published Mon, Oct 24 2016 9:52 PM

బాస్కెట్‌బాల్‌ టోర్నీలో జిల్లాకు ద్వితీయ స్థానం

నూజివీడు : ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహిస్తున్న అండర్‌–14 బాస్కెట్‌బాల్‌ పోటీల్లో బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు ద్వితీయ స్థానం పొందినట్లు కోచ్‌ వాకా నాగరాజు తెలిపారు. ఫైనల్‌ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టుపై 18–21తేడాతో ఓటమిపాలైనట్లు చెప్పారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన నలుగురు జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. బాలుర జట్టుకు ఎ.శ్రీనివాస్‌(నెల్లూరు రవీంద్ర భారతి), ఎన్‌వీఎన్‌ శశాంక్‌(కుమార్‌ స్కూల్‌), బాలికల జట్టుకు సయ్యద్‌ ఉర్ఫాఫరోజ్‌(ఎస్‌ఆర్‌ఆర్‌ హైస్కూల్‌), సీహెచ్‌ రాణి(రమణక్కపేట హైస్కూల్‌) ఎంపికయ్యారని వివరించారు. వీరు నంబవర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.  


 

Advertisement
Advertisement