సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సనత్నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచీని మోసం చేసి రూ.8.29 కోట్లు కొల్లగొట్టిన కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బ్యాంకు ఉద్యోగి చెరుకు ఉదయ్ కుమార్లకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బ్యాంకు మేనేజర్ మద్దూరు చెన్నారెడ్డి, మాజీమంత్రి ఎం.డి. షాకీర్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. వెంకటప్రసాద్, ఉదయ్కుమార్లకు రూ.13 లక్షల చొప్పున, చెన్నారెడ్డికి రూ.3 లక్షలు, షాకీర్కు రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీర్పు అనంతరం పోలీసులు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.
ఎలా కొల్లగొట్టారంటే...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 100 ఖాళీ డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లను 1998లో మేనేజర్ చెన్నారెడ్డి దొంగలించి నిందితులతో కుమ్మక్కయ్యారు. పలువురి పేర్లతో రూ.500 చొప్పున డీడీలను తీశారు. ఈ డీడీ నంబర్ను తాము దొంగిలించిన ఖాళీ డీడీల్లో వేసి రూ.500 స్థలంలో రూ.9 లక్షలు వేసుకుని నగదు డ్రా చేసుకునేవారు. ఇలా రూ.8.29 కోట్లు కొల్లగొట్టారు. ఈ డబ్బుతో ఆస్తులు, బంగారం కొనుగోలు చేశారు. దీన్ని గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. కేసు విచారణలో ఉండగానే నిందితులుగా ఉన్న దినేశ్ దయాల్దాస్ అనే వ్యక్తి చనిపోగా కుంచం భూపాల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆరు, ఎనిమిదో నిందితులుగా ఉన్న కాసుల నరేంద్ర సునీల్కుమార్, ఉమేష్ జగన్నాథ్ అనోకర్లు పరారీలో ఉన్నారు.
టీడీపీ నేత ‘కందికుంట’కు ఏడేళ్ల జైలు
Published Wed, Jun 1 2016 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement