మంత్రి జోగు రామన్న చెప్పారు: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులకు వర్తింపజేసే సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)పై అధ్యయనానికి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జోగు రామన్న చెప్పారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ ఉప సంఘం నివేదిక వచ్చే వరకు రాష్ర్టంలో బీసీ క్రిమిలేయర్ జీవోను పెండింగ్లో పెడతామని హామీనిచ్చినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రిమిలేయర్ అమలు చేయబోమని మంత్రి గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరామన్నారు. దీని అమలును నిలిపివేయాలని తాను, జాజుల శ్రీనివాస్గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్ తదితరులతో కూడిన ఒక ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి ఆయా అంశాలను వివరించినట్లు కృష్ణయ్య విలేకరులకు తెలిపారు.
బీసీలను విభజించు, పాలించు.. అనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏ సామాజిక వర్గానికి లేని దానిని బీసీలకే ఎందుకు అమలు చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 26 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్ను అమలు చేయాలని ప్రయత్నించి, బీసీల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహంతో ఆయా ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయన్నారు.
ఆ జీవోను పెండింగ్లో పెట్టాలని సీఎం కేసీఆర్కు లేఖ
బీసీ క్రీమీలేయర్ జీవోను వెంటనే పెండింగ్లో పెట్టాలని, ఈ మేరకు అన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు ఆదేశాలివ్వాలని సీఎం కేసీఆర్కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మళ్లీ క్రీమీలేయర్ను అమలు చేయాలని జీవోను జారీ చేశారని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం క్రీమీలేయర్ను అమలుచేస్తామని టీఎస్పీఎస్సీ, ట్రాన్స్కో, జెన్కో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్టీసీ, ఇతర రిక్రూట్మెంట్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. గతంలో దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా, దాని నివేదిక కూడా రానందున ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టాలని కోరారు.
క్రీమీలేయర్పై మంత్రివర్గ ఉపసంఘం
Published Sat, Nov 28 2015 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement