చాగల్లు: చాగల్లు మండలం నందిగంపాడుకు చెందిన యువకుడిని హత్య చేసిన కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకరైన మారిశెట్టి గోపాలకృష్ణను పోలీసులు మంగళవారం నిడదవోలు కోర్టుకు తరలించారు. కోర్టు గోపాలకృష్ణకు 15 రోజుల రిమాండ్ విధించినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ తెలిపారు.
నిందితుడు గోపాలకృష్ణను తమకు అప్పగించాలంటూ సోమవారం చాగల్లు పోలీస్స్టేషన్ వద్ద మృతుడి బంధువులు తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కోర్టుకు తరలింపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అస్తికోసం నందిగంపాడు గ్రామానికి చెందిన సొంత బావమరిదైన ఆత్కూరి రాజసాయి మణికంఠపై హత్యాయత్నం చేయడంతో పాటు మణికంఠ పెదనాన్న కొడుకైన ఆత్కూరి రాజేష్ను హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఊనగట్లకు చెందిన మారిశెట్టి వెంకటరత్నంతో పాటు అతని తమ్ముడు గోపాలకృష్ణను నిందితులుగా పోలీసులు గుర్తించారు. సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తును పోలీసులు కూడా వేగవంతం చేశారు.
పోలీసుల అదుపులో వెంకటరత్నం?
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మారిశెట్టి వెంకటరత్నం పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిడదవోలు సర్కిల్ ఫరిధిలో ఓ పోలీస్స్టేషన్లో నిందితుడిని విభిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. వెంకటరత్నంను బుధ, గురువారాల్లో కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రెండు గ్రామాల్లో పోలీస్ గస్తీ
ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నందిగంపాడు, ఊనగట్ల గ్రామాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం చాగల్లు పోలీస్స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాజేష్ మృతదేహానికి నందిగంపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐ బాలకృష్ణ గ్రామం వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
నిందితుడు గోపాలకృష్ణ కోర్టుకు తరలింపు
Published Wed, May 25 2016 12:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement