ఇరిగేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్‌.. | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్‌..

Published Tue, Aug 15 2017 12:23 PM

ఇరిగేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్‌.. - Sakshi

నంద్యాల: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి టీడీపీ నేతలకు సవాలు విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు సీమలో కనీసం వెయ్యి ఎకరాలకైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. రాయలసీమలోని కేసీ కెనాల్‌ కింద పంటలు ఎండిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.
 
 కర్ణాటకలో జలాశయాలు నిండినా.. ఏపీకి నీళ్లు రావడం లేదన్నారు. దీంతో రాయలసీమలో కరువు తాండవం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు. కనీసం కృష్ణాబోర్డుకు కూడా చంద్రబాబు లేఖ రాయలేదని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల ప్రాజెక్ట్‌తోనే కేసీ కెనాల్‌ స్థిరీకరణ జరుగుతోందన్నారు.
 

Advertisement
Advertisement