రాష్ట్రపతితో భేటీకానున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో భేటీకానున్న వైఎస్ జగన్

Published Sun, Jul 5 2015 3:45 PM

రాష్ట్రపతితో భేటీకానున్న వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశంకానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వైఎస్ జగన్ బృందం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్తో భేటీ అవుతారు.

వైఎస్ జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఓటుకు కోట్లు కేసు, ఆంధ్రప్రదేశ్ సమస్యలను వైఎస్ జగన్ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇదిలావుండగా ఈ రోజు రాత్రి టీడీపీ నేతలు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement