చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసుశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు హంస, అజయ్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పురుషోత్తంపైనే నెపం మొత్తం నెట్టేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో సీజ్ చేసిన వాహనాన్ని ఎవరి అనుమతి లేకుండానే పురుషోత్తం చిత్తూరుకు తీసుకురావడం అసాధ్యం. పోలీసు స్టేషన్లో అధికారులు పురమాయించిన పనులను చేయడానికే పురుషోత్తం సీజ్ చేసిన వాహనాన్ని చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ పని పూర్తి చేసుకుని పోలీసు స్టేషన్కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం చాలా నెలల క్రితమే గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో సీజ్ చేసి ఉంచారు. ఫలితంగా వాహనం కండీషన్లో లేకుండా పోయింది.
ఇలాంటి వాహనాన్ని స్టేషన్ అధికారులు పనిపై పంపితేనే పురుషోత్తం చిత్తూరుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పురుషోత్తంతో పాటు వ్యానులో మరో ఇద్దరు యూనిఫామ్లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదానికి వీరద్దరూ కారణం కాకపోయినప్పటికీ పైఅధికారులు చెప్పిన పనిచేయడానికి స్టేషన్లో ఉన్న వాహనాన్ని తీసుకొచ్చినట్లు నిర్ధారణ అవుతోంది. వాహనం స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలపై దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డికి గంగాధరనెల్లూరు స్టేషన్లో పనిచేస్తున్న కొందరు పోలీసులు ఈ వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
చిత్తూరు రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ?
Published Fri, Mar 6 2015 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement