ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి
తిరుపతిలో సుగుణమ్మను పోటీలేకుండా గెలిపించుకుందాం
రాష్ట్ర మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతి ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ సీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలిపిం ది. ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని పా ర్టీలు పాటించాలని శనివారం తిరుపతి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. మానవత్వంతో అన్ని రాజకీయ పార్టీలు సుగుణమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పో టీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అయినా నందిగామ, ఆళ్లగడ్డ, తిరుపతిలోనూ మానవత్వంతో ఒక మంచి సంప్రదాయాన్ని వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు పాటిస్తున్నాయని గుర్తుచేశారు.
ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ, అభినందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. నందిగామలో పోటీ పెట్టి, ఆళ్లగడ్డలో తప్పుకుని, తిరుపతిలో పోటీ పెడ తామనడం బాధాకరమన్నారు. బీసీ మహిళపై ఎస్సీ అభ్యర్థిని పోటీకి దించుతామని సోనియాగాంధీ చెప్పడం ఆమె స్థాయికి సరికాదన్నారు. లోక్సత్తా, ఇండిపెండింట్ల కూడా ఏకగ్రీవానికి సహకరించాలని కోరతామన్నారు.
ఇలా వస్తానని అనుకోలేదు
టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ ఇంటికే పరిమితమైన తాను ఇలా బయటకు వస్తానని అనుకోలేదన్నారు. భర్త చనిపోవడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం ఇలా ముందుకు వచ్చానన్నారు. ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ఆర్ సీపీ లాగ అన్ని పార్టీలు సహకరించాలని వేడుకున్నారు. తన భర్త కాంగ్రెస్లో క్రమశిక్షణగల కార్యకర్తగా రాష్ట్ర విభజన సమయం లో విధిలేని పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలు గుర్తించి తన ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని వేడుకున్నారు. టీడీపీ నాయకులు గౌనివారి శ్రీనివాసులు, శ్రీధర్వర్మ, సూరా సుధాకర్రెడ్డి, నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, క్రిష్ణాయాదవ్, జనతాగిరి, పుష్పావతి, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీకి కృతజ్ఞతలు
Published Sun, Jan 25 2015 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
నాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే..
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
దేశంలోనే అత్యధిక మెజారిటీ..
● హైలైట్స్..
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు మృతి
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement