నరసాపురం అర్బన్ : నరసాపురం ప్రాంతంలో గల్ఫ్ మోసాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. మొగల్తూరుకు చెందిన 10మంది మహిళలు గల్ఫ్ ఏజెంట్ తిమోతి చేతిలో మోసపోయి అతికష్టం మీద స్వదేశానికి ఇటీవల తిరిగి వచ్చారు. నరసాపురం పట్టణంలోని కృష్ణబాబు కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు విజిటింగ్ వీసాతో మోసపోయి గల్ప్ వెళ్లి నానాఇబ్బందులు పడి ఎట్టకేలకు సొంత గూటికి చేరుకున్నారు. ఈ రెండు ఘటనలు గత నెలలో జరిగినవే. వీటిని మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మొగల్తూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 42 మం దికి ఇరాక్లో భారీగా ఆదాయం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ ఏజెంట్ పెద్దమొత్తంలో సొమ్ములు వసూలు చేసి మొహం చాటేశాడు. అతడి చేతిలో రామన్నపాలెం, కొత్తోట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 42 మంది మోసపోయారు. ఒక్కొక్కరు ఏజెం ట్కు రూ.80 వేల చొప్పున చెల్లించారు. ఇరాక్ వెళ్లడానికి ముంబై చేరుకున్న 42 మంది, తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. చివరకు ముం బైలోని ఆంధ్రా అసోసియేషన్ను ఆశ్రయించి న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నరసాపురం ప్రాంతంలో సంచలనం కలిగించింది.
మోసగించిందిలా..
మొగల్తూరు మండలం రామన్నపాలెంకు చెందిన గుత్తుల త్రిమూర్తులు కొంతకాలం క్రితం కూలి పనికోసం ఇరాక్ వెళ్లాడు. అక్కడ కరీంనగర్కు చెందిన భూమేష్ అనే వ్యక్తి అతడికి పరిచమయ్యాడు. భూమేష్, త్రిమూర్తులు ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసేవారు. త్రిమూర్తులుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో కొద్దినెలల క్రితం స్వగ్రామం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో సొమ్ములు దండుకోవడానికి పథకం పన్నిన భూమేష్ రెండు నెలల క్రితం త్రిమూర్తులుకు ఫోన్ చేశాడు. ఇరాక్లో డ్రైవర్లు, ఇతర ఉద్యోగాలకు చాలా డిమాండ్ వచ్చిందని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే పంపించమని సలహా ఇచ్చాడు.
భూమేష్ మాటలు నమ్మిన త్రిమూర్తులు రామన్నపాలెం చుట్టుపక్కల గ్రామాలకు చెం దిన 42 మందిని ఇరాక్ వెళ్లాల్సిందిగా ప్రోత్సహించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల చొప్పున రూ.40 లక్షలకు పైగా వసూలు చేశా డు. 15 రోజల క్రితం రామన్నపాలెం వచ్చిన భూమేష్ ఆ సొమ్మును, వారి పాస్పోర్టులను తీసుకుని అందరినీ ముంబై రమ్మన్నాడు. అక్కడినుంచి విమానంలో ఇరాక్ పంపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ముంబై వెళ్లిన 42 మందికి భూమేష్ సమాచారం దొరకకపోవడం, ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో కంగుతిని మోసపోయామని తెలుసుకున్నారు. బుధవారం ముంబైలోని ఆంధ్రా అసోసియేషన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు.
చర్యలేవీ..
డెల్టా ప్రాంతంలో ఈ తరహా మోసాలకు అంతే లేకుండాపోతోంది. మోసాల నిరోధానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ తరహా ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధికొక గల్ఫ్ ఏజెంట్ ఉన్నాడంటే అతిశయోక్తి లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్థాని కంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, బయట దేశాలకు వెళితే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చన్న ఆశ పేద, మధ్య తరగతి ప్రజలను ఏజెంట్ల వలలో పడేలా చేస్తోంది. దీంతో అప్పులు చేసి సొంత మనుషులను వదిలి పరాయి దేశాలకు పయనమవుతున్నారు. ఏజెంట్లు విజిటింగ్ వీసాలు, ఇతర తప్పుడు విధానాలతో వారిని నిలువునా ముంచుతున్నారు. దీంతో ఎడారి దేశాలకు వెళ్లిన వారు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.
గల్ఫ్ పేరిట టోకరా
Published Thu, Apr 2 2015 3:49 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement