వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ మేడే ర్యాలీ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ మేడే ర్యాలీ

Published Sun, May 1 2016 12:33 PM

వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ మేడే ర్యాలీ - Sakshi

శ్రీకాకుళం టౌన్ : కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.

అనంతరం కార్మికులు పార్టీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ మీదుగా వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీవరత్నం, పార్టీ అధికార ప్రతినిధి ధనుంజయ్, ప్రధాన కార్యదర్శి పద్మ, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement