హైదరాబాద్ : గస్తీ, తనిఖీలు, సోదాలు, పికెట్లు... ఇవన్నీ మన కంటికి కనిపించే సాధారణ పోలీసింగ్లో భాగం. వీటితో పాటు సమకాలీన అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ఆధునిక పోలీసింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగమైన సైబర్ స్పేస్ పోలీసింగ్ను యాకూబ్ మెమన్ ఉరి శిక్ష అమలు నేపథ్యంలో గురువారం నిర్వహించారు. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. యాకూబ్ ఉరిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎలాంటి అపశృతులకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై జరిగే ప్రదర్శనలు, నిరసనలకన్నా సైబర్ స్పేస్ ద్వారా చోటు చేసుకునేవే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తరించిన సోషల్ మీడియా తదిరాలు సమాచార మార్పిడిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిద్వారా ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో వందలు, వేల మందికి చేరిపోతోంది. యాకూబ్ ఉరి శిక్ష అమలు నేపథ్యంలో అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా, కొన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారు యాదృచ్ఛికంగా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు తదితరాలు తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం పొంచి ఉంటుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం సైబర్ స్పేస్ పోలీసింగ్ను చేపట్టింది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియా పైనా టెక్నికల్ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్, ఎస్ఎమ్మెస్లతో పాటు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయిన ఆర్కుట్, ఫేస్బుక్లపైనా సాంకేతికంగా కన్నేశారు. వీటిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు, ఫొటోలు తదితరాల పోస్టింగ్ ఉంటున్నాయా? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని యోచిస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసుల దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సైబర్ స్పేస్ పోలీసింగ్
Published Thu, Jul 30 2015 7:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement