పవన్ కల్యాణ్ 'జనసేన'పై పోలీసులకు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ 'జనసేన'పై పోలీసులకు ఫిర్యాదు

Published Wed, Aug 27 2014 7:40 PM

పవన్ కల్యాణ్ 'జనసేన'పై పోలీసులకు ఫిర్యాదు - Sakshi

హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో్ 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటో పెట్టారని ఆరోపించారు.

మహాత్మా గాంధీని కించపరచారని, చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. కాగా జనసేన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావాల్సివుంది.

Advertisement
Advertisement