తనను కలసిన ఆశావహ అభ్యర్థులకు జగన్మోహన్రెడ్డి హామీ
హైదరాబాద్: సివిల్ సర్వీసు ప్రవేశ పరీక్షల్లో గణిత అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ప్రస్తుతపరీక్షా విధానంలో మార్పుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఆశావహ అభ్యర్థులు కోరారు. పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి వై ప్రదీప్రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ విద్యార్థి విభాగం నేత రఘునాథ్రెడ్డి నాయకత్వంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 మంది ఆశావహ అభ్యర్థులు సోమవారం జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. 2011 ముందు యూపీఎస్సీ అనుసరించిన పరీక్షా విధానం అందరికీ అవకాశాలు కల్పించేదిగా ఉందని వారు జగన్కు తెలిపారు. సీ శాట్ ఏర్పాటుతో గణితం, ఆంగ్లంలలో పట్టున్న వారికే సివిల్స్లో అవకాశాలొస్తున్నాయని వివరించారు.
గ్రామీణ విద్యార్థులతోపాటు పట్టణ ప్రాంతాల్లో సాధారణ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. సీ-శాట్ విధానం...ఐఐటీ, ఐఐఎం వంటి కోర్సులు చేసిన వారికి లబ్ధి కలిగించేదిగా ఉందని, ఈ విధానం అమల్లోకొచ్చాక వెలువడిన సివిల్ సర్వీసు ఫలితాల్ని విశ్లేషిస్తే వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని వివరించారు. గతంలో ఆర్ట్స్, సైన్సు, కామర్స్, ఎకనమిక్స్, పాలిటీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర అన్నివర్గాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి వారివారి సామర్ధ్యాన్ని గుర్తించి సమానావకాశాలు కల్పించేలా సివిల్ సర్వీసు పరీక్షలు ఉండేవన్నారు. సీ-శాట్ వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు లబ్ధి కలుగుతుండగా, ఇతరులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయమై పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం కల్పించాలని వారు జగన్ను కోరారు. సీ-శాట్ను రద్దుచేసి పాత విధానంలోనే సివిల్ సర్వీసు పరీక్షలు నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. ఈ విషయాన్ని పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావిస్తామని జగన్...తనను కలసిన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
‘సీ-శాట్’ను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
Published Tue, Apr 21 2015 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement