ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ

Published Tue, Oct 21 2014 6:48 PM

ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్టాలకు పర్యవేక్షకులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా రాజీవ్ ప్రతాప్ రూడీ నియమితులయ్యారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలు పీకే కృష్ణదాస్ కు అప్పగించారు.

ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళీధర్ రావును కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Advertisement