భూమా తనయుడి హల్‌చల్‌ | Sakshi
Sakshi News home page

భూమా తనయుడి హల్‌చల్‌

Published Wed, Aug 23 2017 12:16 PM

భూమా తనయుడి హల్‌చల్‌

సాక్షి, నంద్యాల: పట్టణంలోని మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్‌ రెడ్డి హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ జరగుతుండగా కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్‌ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనపై స్పందించిన శిల్పా మోహన్‌ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్‌ రెడ్డి.. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని అన్నారు.

అందరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు.

Advertisement
Advertisement