'పటేల్... దేశ సమైక్యతకు మారుపేరు' | Sakshi
Sakshi News home page

'పటేల్... దేశ సమైక్యతకు మారుపేరు'

Published Fri, Oct 31 2014 11:19 AM

'పటేల్... దేశ సమైక్యతకు మారుపేరు' - Sakshi

హైదరాబాద్: భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు మారు పేరు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన భారత జాతి గర్వపడేలా పని చేశారని తెలిపారు. శుక్రవారం ఏపీ సచివాలయ ప్రాంగణంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉద్యోగుల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం  జాతీయ ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
Advertisement