ఏపీలో ఐదుగురు ఐఏఎస్లు బదిలీ | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐదుగురు ఐఏఎస్లు బదిలీ

Published Thu, Oct 2 2014 2:25 PM

Andhra Pradesh government transfers 5 IAS officers

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శిగా ఎల్. ప్రేమచంద్రారెడ్డిని నియమించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చక్రధర్బాబు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లుగా వివేక్ యాదవ్, శ్రీధర్లు నియమితులయారు. అలాగే సెర్ప్ అడిషనల్ సీఈవోగా వీరపాండ్యన్ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
Advertisement