విద్యుదాఘాతానికి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువకుడి మృతి

Published Sat, May 23 2015 7:44 PM

An youngster died with electric shock

మహానంది (కర్నూలు జిల్లా): బోరులారీ విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో శనివారం జరిగింది.

 

గోపవరం గ్రామంలో బోరు వేసేందుకు ఓ లారీ వచ్చింది. ఈ క్రమంలోనే బోరు వేస్తుండగా డ్రిల్లింగ్ మిషన్ విద్యుత్ తీగలకు తగిలింది. అదే సమయంలో డ్రిల్లింగ్ మిషన్ ను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రేమ్‌నాద్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement