'జేసీబీలతో అక్రమ లేఅవుట్ల ధ్వంసం' | Sakshi
Sakshi News home page

'జేసీబీలతో అక్రమ లేఅవుట్ల ధ్వంసం'

Published Fri, Jan 30 2015 9:19 PM

'జేసీబీలతో అక్రమ లేఅవుట్ల ధ్వంసం' - Sakshi

గుంటూరు: రాజధాని ప్రాంతంలో 261 ఎకరాల్లో 130 అక్రమ లేఅవుట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అక్రమ లేఅవుట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

తుళ్లూరులో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అక్రమ లేవుట్లను శనివారం ఉదయం 10 గంటలల్లా 25 జేసీబీలతో ధ్వంసం చేస్తామని ప్రకటించారు.

Advertisement
Advertisement