-
95 శాతం మహిళలకు అవి తెలియదట!
భారత్లో మహిళలకు అప్పుపుట్టడం కష్టంగా మారిందని, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది. అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు 47 శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) కోసం టైర్-2 పట్టణాల నుంచి 18-55 ఏళ్ల వయసు ఉన్న 1,200 మందిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు, తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని 95 శాతం మంది మహిళలు చెప్పారు. అయితే 52 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. కానీ 47 శాతం మందికి మాత్రం అప్పుపుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది.సర్వేలో భాగంగా 80 శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు. 51 శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. 31 శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది. ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీటైడ్, గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ ప్రిల్ మాట్లాడుతూ..‘మహిళా వ్యాపారవేత్తలకు అప్పు పుట్టుకపోవడానికి ప్రధాన కారణం..వారు మహిళలు కావడమే. దాంతోపాటు వారు ఉంటున్న ప్రాంతం కూడా అవరోధంగా మారుతోంది. ముఖ్యంగా టైర్-2 పట్టణాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరమైన అవగాహన లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం కరవవడంతో అప్పులు రావడం లేదు’ అన్నారు. -
మహిళాభ్యుదయమే మా లక్ష్యం
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తాం వడ్డీలేని రుణాల పరిమితి రెట్టింపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన రంగారెడ్డి జిల్లా: స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, మహిళల ఆర్థికాభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉద్ఘాటిం చారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇచ్చాయని, దీన్ని తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందని సోమవారం ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. ఇకపై అర్హత ఉన్న ప్రతి సంఘానికి రూ.10 లక్షల వర కు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. స్వయంసహాయక సంఘాల (ఎస్హెచ్జీ) రుణపరిమితిపై త్వరలో సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి అధికారులే కాకండా గ్రామ సంఘం నుంచి ఇద్దరు మహిళలను ఆహ్వానిస్తామని చెప్పారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 150 మందిని ఆహ్వానించి, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే రుణ పరిమితి మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు ఎంతగానో సహకరిస్తున్నారని మహిళా సంఘాలను సీఎం ప్రశంసించారు. వానలు పరుగెత్తుకు రావాలి.. తెలంగాణ ప్రాంతంలో వర్షపాత లోటు తీవ్రంగా ఉందని, ఇందుకు గత ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే కారణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో బ్రహ్మాండమైన వృక్ష సంపద ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అడవుల్లో భారీగా టేకు చెట్లుండేవి. ఆంధ్రపాలనలో ఈ చెట్టన్నీ కొట్టుకుతిన్నారు. దీంతో ఇక్కడ వర్షపాతం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మొక్కలు నాటాలి. ఒక్కో గ్రామానికి 40 వేల చెట్లు నాటేలా తెలంగాణ హరిత హారాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. దీనికి ప్రతి తెలంగాణ బిడ్డ సహకరించాలి. పచ్చదనం నిండితే వానలు ఉరుకొస్తయ్. చైనాలో ప్రజలంతా ఉద్యమంలా చెట్లు నాటి ఎడారి విస్తీర్ణాన్ని తగ్గించారు. నాగార్జునసాగర్లో జరిగిన సమావేశాల తర్వాత కొందరు రైతులు వచ్చి కోతుల బెడద భరించలేకపోతున్నామని చెప్పారు. వాటి నివాసాలైన వృక్ష సంపదను కొల్లగొడితే అవి మనమీద పడుతున్నయ్. వాళ్లకు కూడా చెట్టు నాటాలని చెప్పా.’ అని వివరించారు. నా కార్యసాధనపై ఆత్మవిశ్వాసం ఉంది: కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయానికి పూర్తిస్థాయి విద్యుత్ ఇస్తానని, లేదంటే ఓట్ల డగ బోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ‘నేను చేసే పనులు, సాధించే విధానంపై నాకు పూర్తిగా నమ్మకముంది. కేసీఆర్ మాటిస్తే నూరుశాతం అమలు చేస్తడు.’ అని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ త్వరగా పూర్తిచేసి రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్అలీ, మంత్రులు హరీశ్, మహేందర్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ బూరనర్సయ్య, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, సంజీవరావు, యాదయ్య పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement