-
బెంగాల్ గవర్నర్పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్కు ఆదేశించాలని పోల్ ప్యానెల్కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
Lok Sabha Election 2024: ఇద్దరికీ కీలకమే
తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికైన పశి్చమబెంగాల్లో ఎన్నికలు ఆరో దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా ఐదు విడతల్లో 25 లోక్సభ స్థానాలకు ఎన్నిక ముగిసింది. ఆరో దశలో భాగంగా 8 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. తామ్లుక్, కాంథీ స్థానాల్లో బీజేపీ కీలక నేత సువేందు అధికారిపై ప్రతీకారానికి తృణమూల్ ఉవి్వళ్లూరుతోంది. సువేందు సోదరుడు సౌమేందు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్, పలువురు బెంగాలీ నటుల భవితవ్యాన్ని ఈ దశలో ఓటర్లు తేల్చనున్నారు... బాంకురా2019లో తృణమూల్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీపై కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ 1.74 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. కానీ సొంత కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు! టీఎంసీ నుంచి బాంకురా ఎమ్మెల్యే అరూప్ చక్రవర్తి, సీపీఎం నుంచి న్యాయవాది నీలాంజన్ దాస్ గుప్తా పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరం.ఘాటల్సిట్టింగ్ ఎంపీ, నటుడు, గాయకుడు దీపక్ అధికారి (దేవ్) తృణమూల్ నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. బీజేపీ కూడా ప్రముఖ బెంగాలీ నటుడు, ఖరగ్పూర్ ఎమ్మెల్యే హిరేన్ ఛటర్జీని పోటీకి దించింది. ఎంపీ భారీ సభల ద్వారా దర్పం ప్రదర్శిస్తుంటే తాను రోడ్లపైకొచ్చి సామాన్యులతో మమేకం అవుతున్నానని హిరేన్ అంటున్నారు. సీపీఐ కూడా బరిలో ఉండటంతోటిక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.కాంథీ ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని ఈ స్థానమూ సువేందు కుటుంబానికి కంచుకోటే. ఆయన తండ్రి శిశిర్ అధికారి తృణమూల్ టికెట్పై 2009, 2014, 2019ల్లో వరుసగా గెలిచారు. ఈసారి సువేందు తమ్ముడు సౌమేందు అధికారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పతా‹Ùపూర్ ఎమ్మెల్యే ఉత్తమ్ బారిక్ తృణమూల్ నుంచి, యువ న్యాయవాది ఊర్వశి భట్టాచార్య సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. తామ్లుక్తో పాటు కాంథీలోనూ నెగ్గి సువేందుపై ప్రతీకారం తీర్చుకోవాలని తృణమూల్ చూస్తోంది. మేదినీపూర్ బీజేపీ నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు. అసన్సోల్ దక్షిణ ఎమ్మెల్యే. తృణమూల్ నుంచి మేదినీపూర్ ఎమ్మెల్యే జూన్ మాలియా బరిలో ఉన్నారు. అభ్యర్థులిద్దరికీ సొంత పారీ్టల్లో విభేదాలు తలనొప్పిగా మారాయి. తమ పారీ్టలో విభేదాలు సర్దుకున్నాయని అగి్నమిత్ర చెబుతున్నారు. సీపీఐ నుంచి బిప్లబ్ భట్టా పోటీలో ఉన్నారు. ఝార్గ్రాం ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ కునార్ హెంబ్రమ్ పార్టీని వీడటంతో ప్రణత్ తుడుకు టికెట్ దక్కింది. సంథాలీ రచయిత, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత కాళీపద సోరెన్ను టీఎంసీ బరిలోకి దింపింది. మరోసారి విజయంపై ధీమాతో ఉంది. సీపీఎం నుంచి సోనామణి ముర్ము పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ పీపుల్స్ పార్టీ, ఐఎస్ఎఫ్ కూడా పోటీలో ఉన్నాయి.పురూలియా బీజేపీ సిట్టింగ్ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో ఈసారి కూడా బరిలో ఉన్నారు. తృణమూల్ నుంచి మాజీ మంత్రి శాంతిరాం మహతో, కాంగ్రెస్ నుంచి నేపాల్దేవ్ మహతో, ఫార్వార్డ్ బ్లాక్ తరఫున ధీరేంద్ర నాద్ మహతో, బీఎస్పీ నుంచి సంతోష్ రాజోవర్ పోటీ చేస్తున్నారు. వీరికి ఎస్యూసీఐ విద్యార్థి నేత సుషి్మత మహతో, స్వతంత్ర అభ్యర్థి అజిత్ ప్రసాద్ మహతో గట్టి పోటీ ఇస్తున్నారు. మహతోలంతా కుర్మి సామాజిక వర్గీయులే. బలమైన కుర్మి ఓటు బ్యాంకు కోసం తృణమూల్ బాగా ప్రయత్నిస్తోంది. దాంతో కురి్మల ఓటు బ్యాంకు చీలేలా కని్పస్తున్నాయి. ఆ లెక్కన బీజేపీకి ఈసారి విజయం సులువు కాదంటున్నారు.తామ్లుక్ తృణమూల్, బీజేపీ ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేత, రాష్ట్ర బీజేపీ దిగ్గజం సువేందు అధికారి 2009, 2014ల్లో ఇక్కణ్నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. 2016 ఉప ఎన్నికలో, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు దిబ్యేందు అధికారి తృణమూల్ టికెట్పై గెలవడం విశేషం! ఈసారీ గెలుపు కోసం తృణమూల్ గట్టిగా పోరాడుతోంది. ఈస్ట్ జిల్లా పరిధిలో సువేందు కుటుంబానికి అపార పలుకుబడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతపై నందిగ్రాం స్థానంలో సువేందు 1,956 ఓట్లతో గెలిచారు! మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ ఇక్కడ టికెటిచి్చంది. సీపీఎం కూడా కలకత్తా హైకోర్టు యువ న్యాయవాది సాయన్ బెనర్జీకి టికెటిచి్చంది. తృణమూల్ నుంచి పార్టీ ఐటీ సెల్ చీఫ్ 27 ఏళ్ల దేబాన్షు భట్టాచార్య బరిలో ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
న్యూఢిల్లీ/కోల్కతా: లోక్సభ ఎన్నికల క్రతువులో మరో అంకం ముగిసింది. సోమవారం ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో అక్కడక్కడలా స్వల్ప ఘర్షణలు, ఒడిశాలో కొన్నిచోట్ల ఈవీఎంలలో చిన్న సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 59.06 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 73.14, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూ కశీ్మర్లోని బారాముల్లాలో ఏకంగా 59 శాతం పోలింగ్ నమోదవడం విశేషం! ఇది ఆ లోక్సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత నాలుగు విడతల్లో కలిపి 66.95 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారంతో జమ్మూ కశీ్మర్, మహారాష్ట్రల్లో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తమ్మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 428 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న ఆరు, ఏడో విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. బెంగాల్లో ఘర్షణలు పశ్చిమబెంగాల్లో పలుచోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒడిశాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకుని డ్రైవర్ను నరికి చంపారు. యూపీలో 14 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఎలాంటి ఘర్షణలూ లేకుండా ముగిసింది. ముంబై సౌత్ పరిధిలో ఒకొ పోలింగ్ బూత్లో 56 ఏళ్ల ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాం«దీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, స్మృతీ ఇరానీ, కౌశల్ కిశోర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, ప్రతాప్సింగ్వర్మ తదితరులు ఐదో విడతలో బరిలో ఉన్నారు. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
లోక్సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్
Updatesసాయంత్రం 7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38బీహార్ - 52.35%జమ్మూ-కాశ్మీర్ - 54.21%జార్ఖండ్ - 61.90%లఢఖ్ - 67.15%మహారాష్ట్ర - 48.66%ఒడిస్సా- 60.55%ఉత్తరప్రదేశ్ - 55.80%పశ్చిమబెంగాల్ - 73%మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్..లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదుబీహార్ 45.33 శాతంజమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతంఝార్ఖండ్ 53.90 శాతంలడఖ్ 61.26 శాతంమహారాష్ట్ర 38.77 శాతంఒడిశా 48.95శాతంఉత్తర ప్రదేశ్ 47.55 శాతంవెస్ట్ బెంగాల్ 62.72 శాతంమధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్ 34.62%జమ్మూ కశ్మీర్ 34.79%జార్ఖండ్ 41.89%లడఖ్ 52.02%మహారాష్ట్ర 27.78%ఒడిశా 35.31%ఉత్తరప్రదేశ్ 39.55%పశ్చిమ బెంగాల్ 48.41%#LokSabhaElections2024 | 36.73% voter turnout recorded till 1 pm, in the fifth phase of elections. Bihar 34.62% Jammu & Kashmir 34.79%Jharkhand 41.89%Ladakh 52.02% Maharashtra 27.78% Odisha 35.31% Uttar Pradesh 39.55%West Bengal 48.41% pic.twitter.com/6cxi2tJsHq— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రబాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్, సోదరి సునైనా రోషన్తో కలసి ఓటు వేశారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Actor Hrithik Roshan, his sister Sunaina Roshan & their parents Rakesh Roshan and Pinkie Roshan cast their votes at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5h8XFTRMvA— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రశివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Uddhav Thackeray, his wife Rashmi and son Aaditya cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/Ljg2V0qtYc#UddhavThackeray #AadityaThackeray #LokSabhaElections2024 pic.twitter.com/8nSagjge6V— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్రనటుడు మనోజ్ బాజ్పాయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Mumbai: After casting his vote, actor Manoj Bajpayee says, "This is the biggest festival and everyone should vote as you will get this opportunity after 5 years. If you haven't voted then you have no right to complain..."#LokSabhaElections2024 pic.twitter.com/ECZH5TeBU8— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రక్రికెటర్ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR— ANI Digital (@ani_digital) May 20, 2024 దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Sachin Tendulkar, son Arjun, cast vote in Lok Sabha electionsRead @ANI Story | https://t.co/Lz7fVhAoT0#SachinTendulkar #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/Vq2cgSgYCE— ANI Digital (@ani_digital) May 20, 2024 ఢిల్లీ:ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్- 21.11%జమ్మూ కశ్మీర్- 21.37%జార్ఖండ్- 26.18%లడఖ్- 27.87%మహారాష్ట్ర- 15.93%ఒడిశా- 21.07%ఉత్తరప్రదేశ్- 27.76%పశ్చిమ బెంగాల్- 32.70%#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections. Bihar 21.11% Jammu & Kashmir 21.37% Jharkhand 26.18% Ladakh 27.87% Maharashtra 15.93% Odisha 21.07% Uttar Pradesh 27.76%West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రమహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.థానేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర:బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Veteran actor Dharmendra casts his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/FqXmZ5jFPG— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె ఇషా డియోల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Mumbai, Maharashtra: Actress and BJP MP Hema Malini, her daughter and actress Esha Deol show indelible ink marks on their fingers after casting their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/T3I2wmA0H0— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్:కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.#WATCH | Lucknow, Uttar Pradesh: "I appeal to the voters of the country to cast their vote along with their family members...," says Defence Minister and BJP candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh after casting his vote #LokSabhaElections2024 pic.twitter.com/tf5Pz7hjO8— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్: అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, డైరెక్టర్ జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్బిహార్లోని ముజఫర్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్లాల్గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్ను బరిలోకి దించింది. -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
భుజాన సంచి. అందులో జాగ్రఫీ పుస్తకం, ఒక జత బట్టలు. మెడలో ఎర్ర కండువా. ముఖాన చెరగని చిరునవ్వు. మండే ఎండల్లోనూ అలుపెరుగని ప్రచారం. వయసు 30 ఏళ్లు. పేరు దీప్సితా ధర్. బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం. సీపీఎం సానుభూతిపరురాలిగా మొదలై, ఢిల్లీలో విద్యార్థి నాయకురాలిగా ఎదిగి ఇప్పుడు సొంత బెంగాల్లో శ్రీరాంపూర్ లోక్సభ స్థానం అభ్యరి్థగా బరిలోకి దిగారు. ‘ఖేలా హోబ్’ (గేమ్ ఈజ్ ఆన్) అన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా దీదీ ఇచ్చిన నినాదానికి బదులుగా ‘నేను సైతం సిద్ధం’ అంటూ తలపడుతున్నారు... టామ్ బోయ్... దీప్సిత పశ్చిమబెంగాల్లోని హౌరాలో 1993లో జన్మించారు. తండ్రి పీయూష్ ధర్. తల్లి దీపికా ఠాకూర్ చక్రవర్తి. తాత పద్మనిధి ధర్. అంతా సీపీఎం రాజకీయాల్లో ఉన్నారు. బాల్యం నుంచి టామ్ బోయ్లా పెరిగిన దీప్సితకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని చూసి రాజకీయాలు చేస్తే కుటుంబానికి సమయం ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత అభిప్రాయం మారింది. దక్షిణ కోల్కతాలోని అశుతోష్ కాలేజీలో జియాలజీ చదివాక ఢిల్లీ జేఎన్యూలో జాగ్రఫీలో పీజీ, ఎంఫిల్ చేశారు. పాపులేషన్ జాగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అరంగేట్రం... కోల్కతాలో కాలేజీ రోజుల నుంచీ దీప్సిత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తర్వాత ఎస్ఎఫ్ఐ జేఎన్యూ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పనిచేశారు. రోహిత్ వేముల మృతి సందర్భంగా జరిగిన ఉద్యమంలో, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంగ్లి‹Ù, హిందీ, బెంగాలీల్లో అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడే దీప్సిత జాతీయ చానళ్లలో రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొంటారు. 2011లో బెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోవడం ఆమెను బాధించింది. అదే పదేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాలవైపు నడిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీరాంపూర్ లోక్సభ స్థానంలో సీపీఎం తరఫున రాజకీయ ఉద్ధండులతో పోరాడుతున్నారు. మిస్టర్ ఇండియా వర్సెస్ మిస్ యూనివర్స్ రెండు నెలల ముందునుంచే దీప్సిత ప్రచారం మొదలుపెట్టారు. తృణమూల్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తృణమూల్కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమే. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక బీజేపీలో చేరారు. సీపీఎం నుంచి మాత్రం ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదు. ‘‘మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వాచ్ పెట్టుకుంటే మాయమైపోయేవాడు. మన ఎంపీలదీ అదే పరిస్థితి. గెలుస్తారు, మాయమైపోతారు’’ అంటూ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కళ్యాణ్ కౌంటరిస్తూ దీప్సితను మిస్ యూనివర్స్గా అభివరి్ణంచారు. ‘‘దేశమంతా పర్యటించి వచ్చారు. ఇప్పుడు మిస్టర్ ఇండియాను చూసేందుకు శ్రీరాంపూర్ వచ్చారు’ అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర సీపీఎం తీవ్రంగా మండిపడుతోంది. బాధించిన ‘రంగు’ తన బాల్యం కాస్త బాధాకరంగానే గడిచిందంటారు దీప్సిత. తల్లిదండ్రులిద్దరిదీ మంచి రంగు. తాను మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో ఇరుగుపొరుగు మొదలు అందరూ ‘అమ్మాయేంటి ఇంత నల్లగా ఉం’దని అడిగేవారట. బయటికి వెళ్లినా అదే పరిస్థితి. దాంతో నలుగురికిలోకి వెళ్లాలంటే ఒక రకమైన భయం! ఒకసారి చూసిన వారు మళ్లీ పరికించి చూస్తే తన రంగు గురించేమోననే బాధ తెలియకుండానే కలిగేది. తర్వాత ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడ్డారామె. ఇప్పుడు బెంగాల్లో భయంకరమైన ఎండలు. అయినా ప్రచారంలో దీప్సిత కళ్లజోడు కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే, ‘‘అందరూ నా కళ్లలోకి చూడగలగాలి. నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలగాలి. కళ్లను అద్దాలతో మూసేస్తే ఎలా?’’ అని ప్రశి్నస్తారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
పశ్చిమ బెంగాల్లోని బన్గావ్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?బన్గావ్.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో దిగారు.బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఇక.. బన్గావ్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రచారాన్ని బన్గావ్ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్గావ్లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.అటు.. బన్గావ్ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్ నగర్లో ఆయన భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.మరోవైపు.. సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్కు.. బెంగాల్ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. -
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేధాలు రోజురోజకీ తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాము(టీఎంసీ) ఇప్పటికీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయట నుంచి తమ మద్దతు ఉంటుందని వెల్లడించిన మరుసటి రోజే మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హంహల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో గురువారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఓటర్లను విభజించడానికి కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ (బెంగాల్లో) వారికి ఓటు వేయకండి. రాష్ట్రంలో పొత్తు లేదు. కేవలం కేంద్రంలో మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేస్తున్నాను. అలాగే కొనసాగుతాం. మేము ఇండియాలో భాగమే. దానికి మద్దతునిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి అపార్థం ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.తాజాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. టీఎంసీ ఇండియా కూటమిలో భాగం కాదని, ఆమె మాటలను నమ్మవద్దని తెలిపారు. టీఎంసీ కూటమి నుంచి వెళ్లిపోయిందని, మమతా బెనర్జీ ఎప్పుడైనా బీజేపీ వైపు వెళ్లవచ్చని ఆరోపించారు.‘ఆమె కూటమికి బయట నుంచి, లోపల నుంచి నాకు చేస్తుందో తెలియదు. మీరే ఆమెను అడగాలి. కానీ నాకు ఆమెపై నమ్మకం లేదు.ఆమె కూటమిని విడిచిపెట్టింది. త్వరలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఆశ్యర్యపోనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బెంగాల్ కాంగ్రెస్ను లెక్క చేయదని అన్నారు. కూటమి గురించి ఆమెకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏర్పాటు సమయంలోనే లేవనెత్తాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. ‘ధునుచి నాచ్’లాగే డ్రమ్స్ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. వీళ్లు ముఖ్యంగా రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! డిమాండ్ పిరిగింది... ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్ ఉండేది కాదంటున్నారు శివ్పాద్ దాస్. ఆయన మాచ్లాండ్పూర్లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్పాద్ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 14 ఏళ్ల కిందట మొదలై... ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్ చంద్ర దాస్ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్–హంట్ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలను ప్రస్తావిస్తూ.. పీవోకే భారత్లో భాగమే. మేం దానిని తీసుకుంటామని అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో శాంతి నెలకొందని పశ్చిమ బెంగాల్ సేరంపోరే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా ప్రసంగించారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తుంది. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించింది. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా అదే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు పీఓకేలో రాళ్లు రువ్వుతున్నారు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చొరబాటుదారులు కావాలా లేదా శరణార్థులకు సీఏఏ కావాలా అనేది పశ్చిమ బెంగాల్ నిర్ణయించుకోవాలి. జిహాద్కు ఓటు వేయాలా లేదా వికాస్కు ఓటు వేయాలా అనేది బెంగాల్ నిర్ణయించుకోవాలి అని అమిత్ షా పిలునిచ్చారు. -
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్
కోల్కతా: భారత్లో జరుగుతున్న సార్వత్రిక లోక్సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్ను జైశంకర్.. కోల్కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.ఇరాన్లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు. -
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు. లోక్సభలో అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్స్టాప్గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్సభ ఎన్నికల ముందు తృణమూల్లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్కు గురై కాంగ్రెస్లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
కోల్కతా: గవర్నర్ బోస్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్బెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. రాజ్భవన్లో మహిళా ఉద్యోగిపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై శనివారం సప్తగ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. బోస్ గవర్నర్గా ఉన్నంతకాలం తాను రాజ్భవన్లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్ అంటున్నారు. కానీ గవర్నర్ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు. -
Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్ లోక్సభ స్థానం మాజీ భార్యాభర్తల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికగా మారింది! బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ సౌమిత్రఖాన్పై ఆయన మాజీ భార్య సుజాత మోండల్ బరిలో దిగారు. ఆమె టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సౌమిత్ర విజయం కోసం అన్నీ తానై కష్టపడ్డ సుజాత, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారు. ఈ మాజీ దంపతుల దంగల్లో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. బిష్ణుపూర్లో మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది... రాజకీయ విడాకులు...! సౌమిత్ర ఖాన్ 2014లో తృణమూల్ పార్టీ తరఫున విజయం సాధించి బిష్ణుపూర్పై వామపక్షాల పట్టును బద్దలు కొట్టారు. తరువాత బీజేపీలో చేరి 2019లోనూ గెలిచారు. అనంతరం ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఉద్యోగాల ఆశ చూపి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు సౌమిత్రపై కేసు నమోదైంది. బీజేపీలోకి మారినందునే మమత సర్కారు తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు కారణంగా 2019 ఎన్నికలప్పుడు ఆయన బంకురా జిల్లాలోకి ప్రవేశించకుండా కలకత్తా హైకోర్టు నిషేధించింది. దాంతో భర్త కోసం సుజాత అన్నీ తానై బిష్ణుపూర్లో ప్రచారం చేశారు. ఆమె కారణంగానే 2019లో ఖాన్ విజయం సాధించారంటారు. అయితే బీజేపీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సుజాత 2020లో పార్టీని వీడారు. ఈ విషయంలో భర్త తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయనకూ దూరమయ్యారు! ఆమె టీఎంసీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సౌమిత్ర విడాకులిచ్చారు. ఆ వెంటనే సుజాత తన పేరు నుంచి ఖాన్ను తొలగించుకున్నారు. స్థానిక ఎన్నికల బరిలో దిగి బంకురా జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచారు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట బిష్ణుపూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2014 దాకా సీపీఎంకు కంచుకోట. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి! తృణమూల్ రెండింట్లోనే గెలిచింది. ఈసారి సీపీఎం శీతల్ కెబర్టా అనే టీచర్ను బరిలో దింపింది. ఆమెకు కూడా నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాను గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగం, నీటి కొరత సమస్యలను పరిష్కరిస్తానన్న హామీలకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు. సౌమిత్రపై అసంతృప్తి... తాగునీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి బిష్ణుపూర్లో ప్రధాన సమస్యలు. ఎంపీగా ఇచ్చిన హామీలేవీ సౌమిత్రా నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ఎన్నికల తర్వాత ఆయన కని్పంచనే లేదన్నది స్థానికుల ఆరోపణ. రోడ్ల దుస్థితికి తోడు నేత కార్మికుల దుస్థితి కూడా ఈ చారిత్రాత్మక పట్టణంలో మరో పెద్ద సమస్య. బిష్ణుపూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ చేనేత ఉత్పత్తులను సేకరణకు ఏర్పాట్లే లేవని కారి్మకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు తనదేనని సుజాత విశ్వాసంతో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
కోల్కతా : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముందు సుప్రీం బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు.కేజ్రీవాల్కు జూన్ 1 వరకు మద్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రస్తుత లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడం తమకు ఉపకరిస్తుందని దీదీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆమె ఎక్స్లో పోస్ట్లో పేర్కొన్నారు.మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ వర్తించనుంది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. అయితే సీఎం హోదాలో ఎలాంటి ఫైళ్లపై అధికార సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ
కోల్కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.#WATCH | TMC candidate from Diamond Harbour seat, Abhishek Banerjee files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/SLymSD1IHq— ANI (@ANI) May 10, 2024 -
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా కుట్ర: సువేందు అధికారి కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
మూడో దశలో 63.53% పోలింగ్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల మూడో దశలో 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మంగళవారం రాత్రి 10 గంటల వరకు 63.53 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో జరిగిన స్వల్ప ఘర్షణలు, చెదురుముదురు ఘటనలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిరీ్ణత పోలింగ్ సమయం సాయంత్రం ఆరులోపు క్యూ లైన్లలో నిల్చున్న వారినీ ఓటేసేందుకు అనుమతించారు.దాంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అస్సాంలో అత్యధికంగా 79.79 శాతం, ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కాస్తంత మెరుగ్గా 57.62 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. పశ్చిమబెంగాల్లో పోలింగ్బూత్ వద్ద ఘర్షణలు, ఓటర్లను మభ్యపెట్టడం, బూత్ ఏజెంట్లపై దాడులపై టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్–సీపీఐ(ఎం)లు విడివిడిగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి.ముర్షీదాబాద్, జాంగీపూర్ స్థానాల నుంచి ఈసీకి ఉదయం 9లోపే 180కిపైగా ఫిర్యాదులందాయి. కొన్ని చోట్ల టీఎంసీ, సీపీఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గుజరాత్లోని బనస్కాంతా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు సీఆర్పీఎఫ్ జవాన్లలా వచ్చి పోలింగ్బూత్ వద్ద ఓటర్లను మభ్యపెట్టారన్న ఉదంతంలో కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. గుజరాత్లో ఓటేసిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్ నియోజకవర్గంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్ బీజేపీ అభ్యరి్థ, కేంద్ర మంత్రి అమిత్ షా పోలింగ్ బూత్ వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఇదే పోలింగ్బూత్లో ఓటు ఉండటంతో మోదీ అన్నయ్య సోమాభాయ్ మోదీ సైతం అక్కడికొచ్చారు. దీంతో ఆయన ఆశీర్వాదం తీసుకునే మోదీ ఓటేశారు. ఉదయాన్నే ఓటేసేందుకు వచ్చిన ప్రధానిని కలిసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. అమిత్ షా సైతం ఇదే అహ్మదాబాద్లో మరో చోట ఓటేశారు. ‘ అన్ని నియోజకవర్గాల్లో వయోబేధంలేకుండా ఓటర్లంతా ఎన్డీఏ, అభివృద్ధి అజెండాపై నమ్మకం ఉంచారు. ఇండియా కూటమి వేగంగా నీరుగారిపోతోంది. ఓటుబ్యాంక్ రాజకీయాలకు స్వస్తిపలికి ఆర్థికాభివృద్ధికి జై కొట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు’ అని ఓటేశాక మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. 282 స్థానాల్లో పోలింగ్ పూర్తి అమిత్ షా( గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్కోట్), ప్రహ్లాద్ జోషి(ధార్వాడ్), ఎస్పీసింగ్ బఘేల్(ఆగ్రా) పోటీచేస్తున్న స్థానాల్లోనూ మంగళవారం పోలింగ్ పూర్తయింది. గుజరాత్లోని సూరత్ను బీజేపీ ఏకగ్రీవంగా గెల్చుకోవడంతో మిగతా 25 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, ఛత్తీస్గఢ్లో 7, బిహార్లో 5, అస్సాం, పశ్చిమబెంగాల్లో చెరో 4, గోవాలో 2, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్లో రెండు స్థానాలకు పోలింగ్ జరిగింది. మంగళవారం పోలింగ్ జరిగిన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని మెజారిటీ స్థానాలను 2019లో బీజేపీ కైవసం చేసుకుంది. మూడో దశ పోలింగ్ ముగియడంతో మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా 282 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రం పోలింగ్ శాతం గుజరాత్ 57.62 కర్ణాటక 70.03మహారాష్ట్ర 61.44 ఉత్తరప్రదేశ్ 57.34 మధ్యప్రదేశ్ 66.05ఛత్తీస్గఢ్ 70.05 బిహార్ 58.16 అస్సాం 79.79 బెంగాల్ 73.96 గోవా 75.13 దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 68.89
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement