-
'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.రివార్డ్లుప్రస్తుతం క్రెడిట్ కార్డ్ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్లు గురించి చూపిస్తుంది.ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండిఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.సెక్యూరిటీ ఫీచర్ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్గా ఇన్పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. -
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో యాపిల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఆధునిక ఫీచర్స్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్ల శ్రేణిని ఆపిల్ ఎట్టకేలకు వెల్లడించింది.యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్న లేటెస్ట్ ఫీచర్లలో ఐ ట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్కట్స్, వెహికల్ మోషన్ క్యూస్ వంటివి ఉన్నాయి. visionOS కోసం మరిన్ని యాక్సెసిబిలిటీ అప్గ్రేడ్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.'ఐ ట్రాకింగ్ ఫీచర్'ఐ ట్రాకింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారు తమ కళ్ళతోనే ఐప్యాడ్లు, ఐఫోన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా శారీరక వైకల్యాలు ఉన్న వినియోగదారుల కోసం రూపొందించినట్లు సమాచారం.ఎలా పని చేస్తుందంటే?ఐ ట్రాకింగ్ను సెటప్ చేయడానికి ముందువైపు కెమెరా ఉపయోగించబడుతుంది.ఐ ట్రాకింగ్ కోసం ఉపయోగించిన మొత్తం డేటా మీ డివైస్లో ఉంటుంది. ఇది Appleతో కూడా భాగస్వామ్యం చేయదు. కాబట్టి సమాచారం భద్రంగా ఉంటుంది.ఐప్యాడోస్, iOSలోని అన్ని యాప్లతో ఐ ట్రాకింగ్ పని చేస్తుంది. కాబట్టి అడిషినల్ హార్డ్వేర్ లేదా యాక్సెసరీలు అవసరం లేదు.ఎలా ఉపయోగపడుతుందంటే?ఐ ట్రాకింగ్ సాయంతో యాప్లోని వివిధ భాగాలను చూడటం ద్వారా వాటి ద్వారా నావిగేట్ చేయవచ్చు.ఈ ఎలిమెంట్లను యాక్టివేట్ చేయడానికి డ్వెల్ కంట్రోల్ని ఉపయోగించాల్సి ఉంటుంది.ఐ ట్రాకింగ్ వినియోగదారులు భౌతిక స్పర్శ అవసరం లేకుండా (టచ్ చేయకుండా) కేవలం వారి కళ్లను ఉపయోగించి బటన్లను నొక్కడం, స్వైపింగ్ చేయడం వంటివి చేయవచ్చు. -
WhatsApp Chat Filters: వాట్సాప్లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇదే ఫీచర్ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్లో యాక్టివ్గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇన్స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
థ్రెడ్స్లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్షాట్లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్క్యామ్లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్క్యామ్లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్క్యామ్లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్కెమెరా ఫీచర్ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్టాప్, మ్యాక్బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్ని పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్క్యామ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను
WhatsApp Channels: మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మోస్ట్ఎవైటెడ్ ఫీచర్ను ఇండియాలో లాంచ్ చేసింది. 'ఛానెల్స్' అనే కొత్త టూల్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్-వే బ్రాడ్కాస్ట్ టూల్ ఛానెల్ల ఫీచర్తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవ్వొచ్చు. యూజర్లు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్ నుంచి కీలకమైన అప్డేట్లను పొందవచ్చు. 9 దేశాలలో ఛానెల్లను సృష్టించే ,అనుసరించే సామర్థ్యాన్ని విడుదల చేసిన తర్వాత, iOS, Android , డెస్క్టాప్ కోసం WhatsApp తాజా వెర్షన్ను ఇన్స్టాల్ చేసిన వినియోగదారులు ఈ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ బుధవారం ప్రకటించారు. వేలాది కొత్త ఛానెల్లను జోడిస్తున్నాం మీరు కొత్త 'అప్డేట్లు' ట్యాబ్లో ఛానెల్లను కనుగొనవచ్చు అంటూ ఫేస్బుక్లో పోస్ట్లో వెల్లడించారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు) మీ సొంత వాట్సాప్ ఛానల్ స్టార్ట్ అయిన తరువాత ఇప్పటికే వాట్సాప్లో ప్రముఖ ప్రముఖులు, క్రీడా కారులు కళాకారులు, ఇన్ఫ్యూయర్స్, సంస్థలను ఫాలో అవ్వవచ్చు. ఉదాహరణకు, భారత క్రికెట్ జట్టు, ప్రభాస్, క్రేజీ స్టార్లు, కత్రినా కైఫ్, దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్, నేహా కక్కర్ ఇలా మనకిష్టమైన వారిని ఫాలో అవ్వొచ్చు. అంతెందుకు వాట్సాప్ యజమాని మార్క్ జుకర్బర్గ్ను కూడా అనుసరించ వచ్చు. దేశం ఆధారంగా స్వయంచాలకంగా ఫిల్టర్ అయిన ఛానెల్లను ఎంచుకోవచ్చు. సెర్చ్ చేయవచ్చు.మీ ఫాలోవర్స్ను బట్టి ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్, జనాదరణ పొందిన ఛానెల్లను కూడా వీక్షించవచ్చు. ఇప్పటివరకు చిలీ కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్ , ఉక్రెయిన్లలో ఈ ఛానెల్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. WhatsApp ఛానెల్లను ఎలా ఉపయోగించాలి ♦ మీ WhatsApp యాప్ని Google Play Store లేదా App Store నుండి తాజా వెర్షన్కి అప్డేట్ చేయండి. ♦ WhatsAppఓపెన్ చేసి, స్క్రీన్ దిగువన ఉన్న అప్డేట్స్ ట్యాబ్పై నొక్కండి. ఇక్కడ ఛానెల్స్ లిస్ట్కనిపిస్తుంది. ♦ ఫాలో అవ్వాలనుకున్న సంబంధిత ఛానెల్ని పక్కన ఉన్న ‘+’ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్, ప్రొఫైల్ , ఛానెల్ పేరు కూడా చూడవచ్చు. ♦ ఛానెల్ అప్డేట్ రియాక్షన్ కోసం మెసేజ్ మీద ప్రెస్ చేసి, నొక్కి పట్టుకుంటే చాలు. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) WhatsApp ఛానెల్ కొత్త అప్డేట్ ♦ మెరుగైన డైరెక్టరీ: వినియోగదారులు ఇప్పుడు అధునాతన ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా కొత్త ఛానెల్లను అన్వేషించవచ్చు. ♦ రియాక్షన్స్ ఛానెల్లలో షేర్ అయిన కంటెంట్కు సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ♦ మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్: ఫార్వార్డ్ చేసిన మెసేజ్లు ఛానెల్కి లింక్ బ్యాంక్ అవుతాయి. యూజర్లకు జాయిన్ కావడం ఈజీ అవుతుంది. ♦ డిలీట్ అప్డేట్ ఫర్ ఎవ్రీ వన్: ఛానెల్ క్రియేటర్లకు 30 రోజులలోపు మెసేజ్ను తొలగించే సామర్థ్యాన్ని అందరికీ ఉంటుంది. Mark Zuckerberg announced a global launch for WhatsApp Channels!https://t.co/UcLJJubMo8 pic.twitter.com/LjhzAAvqZ3 — WABetaInfo (@WABetaInfo) September 13, 2023 -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్లో లేఆఫ్లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్కి మారే పని లేకుండా ఈ నోట్స్లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్ను జూమ్ మీటింగ్లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ను, టూల్స్ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్ఫారమ్లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్లను, లింక్లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
Google Flights: అతి తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలా? గూగుల్ కొత్త ఫీచర్ చూడండి!
Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు. ఎలా పనిచేస్తుంది చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్తో పైలట్ ప్రాజెక్ట్ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. క్రిస్మస్ ట్రిప్కోసం ప్లాన్ చేస్తే..? గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ. అమెరికా నుండి యూరోప్ట్రిప్కు బెస్ట్ టైం సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది.. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్ఫారమ్లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్ఫారమ్లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్ను వివరించే స్క్రీన్షాట్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్కు కూడా అందుతుంది. -
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
ఫోన్పే యూజర్లకు గుడ్న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో
కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్ను ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్తో వీడియో కాల్స్ను చేసుకునే ఫీచర్ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ విండోస్లోని కొంతమంది బీటా టెస్టర్లకు వీడియో కాల్ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ టీవీల్లో కొత్త మోడ్.. ఆ రంగులు చూడలేని వారి కోసం..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ (Samsung).. తన 2023 టీవీ, మానిటర్ లైనప్లో సీ కలర్స్ (SeeColors) అనే కొత్త మోడ్ను జోడించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ వర్ణ అంధత్వం ఉన్నవారికి వివిధ సెట్టింగుల ద్వారా మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సీ కలర్స్ మోడ్ తొమ్మిది పిక్చర్ ప్రీసెట్లను అందిస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులు తమ వర్ణ దృష్టి లోపానికి అనుగుణంగా స్క్రీన్పై అన్ని రంగులను సులభంగా గుర్తించగలిగేలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్థాయిలను ఈ ఫీచర్ సర్దుబాటు చేస్తుంది. అందుబాటులో సాఫ్ట్వేర్ అప్డేట్ వాస్తవానికి 2017లోనే ఈ ఫీచర్ ఒక అప్లికేషన్గా విడుదలైంది. సీ కలర్స్ మోడ్ వర్ణాంధత్వ బాధితులు తాము చూడలేని రంగులను సైతం స్క్రీన్పై ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. రానున్న టీవీ, మానిటర్ యాక్సెసిబిలిటీ మెనూలలో ఈ మోడ్ను ఏకీకృతం చేస్తోంది శాంసంగ్ కంపెనీ. ఇప్పటికే 2023 మోడల్ శాంసంగ్ టీవీలు, మానిటర్లు కొనుగోలు చేసిన వారు తమ ఉత్పత్తుల యాక్సెసిబిలిటీ మెనూకి సీ కలర్స్ ఫీచర్ను జోడించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సీ కలర్స్ మోడ్కు సంబంధించి 'కలర్ విజన్ యాక్సెసిబిలిటీ' సర్టిఫికేషన్ను కూడా శాంసంగ్ పొందింది. ఇదీ చదవండి: Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్లను ఆటోమేటిక్గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
మస్క్ సంచలనం.. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు!
ట్విటర్ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్లో కాల్స్, మెసేజ్లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు, లాంగ్ ఫార్మ్ ట్విట్లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెటా తరహాలో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్విటర్లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను బాస్గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్లను గుర్తించి ఆటోమేటిక్గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం మొబైల్ లేకుండా మనకు రోజే గడవదు, అందులోనూ వాట్సాప్, ఫేస్బుక్ వంటివి లేకుండా కాలం ముందుకు సాగదు. అయితే మనకు నచ్చిన వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో స్టేటస్లగా పెట్టుకోవడం సర్వసాధారణమయిపోయింది. అయితే ఇప్పటివరకు వాట్సాప్లో వేరుగా ఫేస్బుక్లో వేరుగా స్టేటస్లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి పద్దతికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది. వాట్సాప్ స్టేటస్ను ఫేస్బుక్లో స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్లో షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలి. అలా కాకుండా వాట్సాప్ తీసుకు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఒకే సమయంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మన వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్లో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్ప్ట్, ఓన్లీ షేర్ విత్ మీ అనే మూడు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే త్వరలో వాటి కింద ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ కూడా రానుంది. వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) వాట్సాప్లో రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మనం ప్రత్యేకంగా ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రెండింటిలోనూ స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్ఫోన్కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్గా పనిచేసి ఫోన్ హీట్ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్.. ఇక కాల్స్ చేయడం మరింత ఈజీ!
వాట్సాప్ కాల్స్ చేసే వారి కోసం అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది దాని యాజమాన్య సంస్థ మెటా. తరచూ వాట్సాప్ ద్వారా కాల్స్ చేసే వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా కాలింగ్ షార్ట్కట్ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంపై కసరత్తు చేస్తోంది. దీని వల్ల మనం ప్రతిసారి కాంటాక్ట్స్ లిస్ట్లోకి వెళ్లాల్సిన పని లేకుండా తరచూ చేసే కాల్స్కు హోం స్క్రీన్పై షార్ట్కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో నేరుగా కాల్స్ చేసేవారితో పాటు వాట్సాప్ ద్వారా కాల్స్ చేసేవారు ఎక్కువయ్యారు. వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు చాలామంది వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం మెటా సంస్థ ఈ ఫీచర్ను తీసుకొస్తోంది. మనం ఎవరితో అయితే తరచుగా కాల్స్ చేస్తుంటామో దానికి సంబంధించిన కాంటాక్ట్కు షార్ట్కట్ క్రియేట్ చేయగానే అది ఆటోమేటిక్గా హోం స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ షార్ట్కట్ను అలా ట్యాప్ చేయగానే వెంటనే కాల్ వెళ్తుంది. ఈ ఫీచర్.. రానున్న అప్డేట్తో అందుబాటులోకి రానుంది. నియోగదారులు వాట్సాప్ ద్వారా ఫొటోలను ఒరిజినల్ క్వాలిటీతో పంపే సౌలభ్యాన్ని సైతం తీసుకొస్తున్నట్లు యాజమాన్యం గత నెలలో ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము పంపే ఫొటోల క్వాలిటీని వారికి నచ్చినట్లుగా కంట్రోల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్లో మెసేజ్ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్ను ఎవరూ చూడకుండా సీక్రెట్గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ను పరీక్షిస్తుండటం గమనార్హం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement