-
ఉప్పొంగిన జనగోదావరి
మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడిరావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్●సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది. ఒకరోజు విరామం తర్వాత శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్ హెల్ప్’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్, తణు కు వై.జంక్షన్, శర్మిష్ట్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై.జంక్షన్ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్ ను చూసి జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సత్వరమే స్పందించి.. పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సిద్ధాంతం.. ఘన స్వాగతం గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్ పక్కన ఉన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. – మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్, పెనుగొండ సావధానంగా విన్నారు కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు. – వేండ్ర మోహనరావు, సిద్ధాంతం అడుగడుగునా అమితాదరణ సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం జై జగన్ నినాదాలతో మార్మోగిన హైవే ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర -
బస్సు యాత్ర విజయవంతం
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు. యాత్ర సాగిందిలా.. పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్, చెముడులంక, మడికి జంక్షన్, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్, ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మూరు సెంటర్ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట, షెల్టన్ సెంటర్, దేవీచౌక్, పేపరు మిల్లు, కాతేరు గామన్ బ్రిడ్జి, ది వాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు. -
నామినేషన్లసందడిషురూ
తొలిరోజు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఆరు ఏలూరు (మెట్రో): నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజు ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్కు ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున మెండెం సంతోష్ కుమార్ తన నామినేషన్ను కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్కు అందజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), దెందులూరు నియోజకవర్గానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఆలపాటి నరసింహమూర్తి, పోలవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ నుండి చిర్రి బాలరాజు, గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి మడకం వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన రాధిక నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు, చింతలపూడి, కై కలూరు నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు కాలేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారాస్థాయిలో ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తొలిరోజు ఏలూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తాలు చూసుకుని.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగనుంది. పార్లమెంట్ అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టర్లకు, అసెంబ్లీ అభ్యర్థులు తహసీల్దార్ కార్యాలయాల్లోని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి. అధికార వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్ష కూటమి పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. నేడు భారీగా నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు తణుకు నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆచంట నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం నుంచి చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నుంచి ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, ఉండి నుంచి పీవీఎల్ నర్సింహరాజు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. ఏలూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దెందులూరు నుంచి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. అలాగే పశ్చిమలో కూటమి అభ్యర్థులుగా టీడీపీ నుంచి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 25 వరకు నామినేషన్ల సందడి ● 20న చింతలపూడి వైఎస్సార్సీపీ అభ్యర్థి కంభం విజయరాజు, 22న కై కలూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు (అభ్యర్థిత్వం ఖరారు అయితే) నామినేషన్లు వేయనున్నారు. ● 23న నూజివీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప అప్పారావు, కై కలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఉంగుటూరు జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ● 24న పోలవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, పాలకొల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి నామినేషన్లు వేయనున్నారు. ● 25న తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం తొలిరోజు ఏలూరు జిల్లాలో 6, పశ్చిమలో ఒకటి దాఖలు ఏలూరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆళ్ల నాని నేడు రెండు జిల్లాల్లోనూ భారీగా నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు -
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కే శ్రీనివాసులురాజు తెలిపారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి నేరుగా గాని ప్రతిపాదనతోగానీ నేటి నుంచి 25వ తేదీ గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేయకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కాకుండా ఏరోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు భీమవరం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్కు గానీ నామినేషన్లు అందించవచ్చన్నారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల పత్రాలను పొందవచ్చునని, ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఏదైనా అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ సందర్భంలో ఫారం–5 ద్వారా అభ్యర్ధి రాత పూర్వకంగా ఉపసంహరించుకోవచ్చునని, అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఆర్డీవో శ్రీనివాసులు రాజు -
వైఎస్సార్ సీపీలో చేరిన కూటమి నేతలు
తాడేపల్లిగూడెం అర్బన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి కూటమి నేతలు వలసలు కొనసాగుతున్నాయి. గురువారం పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన గమిని సుబ్బారావు గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గమినిని మంత్రి కొట్టు వైఎస్సార్ సీపీ కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ వైస్ చైర్యన్, వ్యాపారవేత్త గమిని సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరడం శుభసూచకమన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాతంగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరితోను స్నేహంగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వెళతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ఇది చూసిన కూటమి నేతలు అయోమయంలో ఉన్నారన్నారు. గమని సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్సార్సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై జగన్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ప్రజల భవిష్యత్తు జగన్మోహనరెడ్డి అని సుబ్బారావు అన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ గమని సుబ్బారావు వంటి వ్యక్తులు వైఎస్సార్సిపిలోకి చేరడం సంతోషకరమన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: సీఎం వైఎస్ జగన్ పాలన మెచ్చే ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గూడాల గోపి అన్నారు. పాలకొల్లులో గురువారం 18వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి గుడాల గోపి వైఎస్సార్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు ఇన్చార్జి రామాంజుల పెద్దమదు, ఖండవల్లి వాసుల సమక్షంలో పసుపులేటి రమేష్, పసుపులేటి సుధ, పసుపులేటి జాన్,కొండేటి హనోక్, పసుపులేటి దివ్య, పసుపులేటి రాజేష్, కౌంజు మరేష్, కొల్లి పాప, బెజవాడ లక్ష్మీ, కంకిపాటి శ్రీదర్, వడ్లపాటి పల్లంరాజు, తెన్నేటి రాజేష్బాబు, తానేటి బ్రూస్రామ్, కానూరి రమణ, అనపర్తి రవిబాబుల కుటుంబ సభ్యులు వైఎస్సార్ పార్టీలో చేరారు. సంచారజాతుల కార్పోరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, యడ్ల తాతాజీ, గుమ్మాపు వరప్రసాద్, పాలపర్తి కృపానాథ్, సనమండ సురేష్, పసుపులేటి వీరాస్వామి, రామాంజు చిన్నమధు, కె.జక్కరయ్య, ఎం.జయరావు పాల్గొన్నారు. గుండుగొలనులో.. భీమడోలు: గుండుగొలనుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ భీమడోలు మండల ఇన్చార్జి పుప్పాల కార్తీక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, సొంతింటి కలను సాకారం చేశారన్నారు. అనంతరం పుప్పాల కార్తీక్ సమక్షంలో టీడీపీకి చెందిన వెలగల కృష్ణ, పి.సతీష్, పి.ప్రసాద్, రెడ్డి ప్రసాద్, విశాఖ పవన్, విశాఖ రంగ, గోంగాడ శివ, గుమ్మడి దుర్గారావు, ఆళ్ల దుర్గారావు, ఆళ్ల హేమంత్ తదితరులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్లను గెలిపించేందుకు యుద్ద సైనికుల్లా పని చేయాలని కార్తీక్ వారిని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుండి సూర్యనారాయణరాజు, నాయకులు జహీర్, పసుపులేటి శ్రీను, వార్డు సభ్యుడు గొటికల మురళీ, నాయకులు నల్ల శ్రీను, మర్రాపు బాబు, వగ్వాల రామన్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు నైతిక విలువలు అవసరం
తాడేపల్లిగూడెం: విద్యార్థులకు నైతిక విలువలు అవసరం అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.జానకీరామ్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల 18వ వార్షికోత్సవం గురువారం రాత్రి జరిగింది,. వీసీ మాట్లాడుతూ విద్యార్ధులు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. ఈ సందర్బంగా యూట్యూబ్లో వర్చువల్ క్లాస్రూమ్ను ప్రారంభించారు. కళాశాల మ్యాగజైన్ సౌగంధిని ఆవిష్కరించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, సలోమి, మాధవి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్ -
22, 23 తేదీల్లో గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు బాలురకు పెదవేగి గురుకుల పాఠశాలలో ఈనెల 22న, బాలికలకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి యన్.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న బాలికలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల పెదవేగిలో ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఆచంట గురుకుల బాలుర పాఠశాలల్లో చేరేందుకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్లైన్ విధానంలో సీట్ల భర్తీ జరిగినట్లు తెలిపారు. మెరిట్తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే ద్యార్థులు ప్రవేశపరీక్ష హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాలుగో తరగతి స్టడీ సర్టిఫికెట్, ఆధార్ వెంట తీసుకురావాలని సూచించారు. బాలురకు సంబంధించి ఎస్సీ–48, బీసీ–7, బీసీ (సీ)–26, ఎస్టీ–14, ఓసీ–1 కలిపి మొత్తం 96 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. బాలికలకు సంబంధించి ఎస్సీ–36, బీసీ–7, బీసీ(సీ)–31, ఎస్టీ–12, ఓసీ–1 కలిపి మొత్తం 87 సీట్ల ఖాళీలు ఉన్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎన్.భారతి వివరించారు. -
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు
భీమవరం: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ అజిత తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పాటించాల్సిన ఎన్నికల నియమావళికి సంబంధించి గురువారం ఆమె ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు, సానుభూతిపరులు ఎన్నికల సంఘం విధివిధానాలను తప్పక పాటించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు పొందాలని, సమయం, వారు ప్రయాణించే మార్గాం వివరాలు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఊరేగింపులో పది వాహనాలకు మించి ఉండరాదని, డీజేలు, మందు గుండు సామగ్రిని ఉపయోగించాదన్నారు. అభ్యర్థుల ప్రసంగాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో 100 మీటర్ల లోపులో అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గుడాల గోపికి రిటైర్డ్ ఎస్పీ మూర్తి మద్దతు పోడూరు: పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గుడాల గోపికి పెనుమదం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ జీవీఎస్ మూర్తి మద్దతు తెలియజేశారు. పెనుమదంలో గురువారం వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో స్ధిరపడిన రిటైర్డ్ ఎస్పీ మూర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి తన మద్దతు తెలిపారు. ఆత్మీ య సమావేశం సందర్భంగా ఆయన మండల కన్వీనర్ పితాని చిన్నా, గ్రామక కమిటీ అధ్యక్షుడు గెద్దాడ ఏసులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు సమన్యాయంతో పరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు తన సంఘీభావం తెలుపుతూ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాలకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు మూర్తి స్థానిక నాయకులతో మాట్లాడుతూ చెప్పారు. మూర్తి మద్దతుతో మరింత ఉత్సాహంతో ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాల విజయానికి మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని పెనుమదం వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
భవన్స్లో ముగిసిన త్రోబాల్ పోటీలు
పాలకొల్లు (సెంట్రల్): భవన్స్ ఇంటర్ స్కూల్ బాలికల త్రోబాల్ పోటీలు భారతీయ విద్యా భవన్స్ గ్రీన్ ఫీల్డ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి చెప్పారు. భీమవరం, పాలకొల్లు, వడ్లవానిపాలెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, గుంటూరు భవన్స్కు చెందిన క్రీడాకారిణులు పాల్గొన్నారన్నారు. వడ్లవానిపాలెం భవన్స్ విద్యార్థిని వై.వైష్ణవి బెస్ట్ సర్వర్ అవార్డును కై వసం చేసుకుందని తెలిపారు. పోటీల్లో తాడేపల్లిగూడెం ప్రథమస్థానం, గుంటూరు ద్వితీయ స్థానం, భీమవరం తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. పీడీ గొట్టుముక్కల శేఖరరాజు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు, ప్రిన్సిపాల్ ఐ.మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ ఎంవీ సూర్యన్, అధ్యాపకులు, పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన భీమవరం (ప్రకాశంచౌక్) : ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం భీమవరం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. ముందుగా వ్యయ పరిశీలకులు పియూష్ శుక్లా, మోహన్ అగర్వాల్, విక్రమాదిత్య మీనా కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో విభాగాలను పరిశీలించారు. ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, వ్యయ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్–రిడ్రెసల్ సెల్ తదితర విభాగాల గురించి కలెక్టర్ వారికి వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ సీవీ ప్రవీణ్ ఆదిత్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ తదితరులు ఉన్నారు. నేటి నుంచి బాస్కెట్బాల్ అంతర్ జిల్లా పోటీలు నూజివీడు: పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఏపీ స్టేట్ 9వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బాస్కెట్బాల్ కోచ్ వాకా నాగరాజు గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన బాస్కెట్బాల్ జట్లు పాల్గొంటాయన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ పోటీలను బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్, విక్టోరియా పురమందిరంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సెంటిమెంటు స్వామి
తాడేపల్లిగూడెం: దండాలు స్వామి.. వెంకన్న స్వామి.. అంటూ నందమూరు వెంకన్నను దర్శించుకోకుండా ఎన్నికల వేళ రాజ కీయ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టరు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ఏ అభ్యర్థి అయినా తాడేపల్లిగూడెం మండలం నందమూరులో వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడ స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని ఓ విశ్వాసం. దీంతోపాటు భౌగోళికంగా చూసినా నియోజకవర్గానికి తూర్పు దిశలో ఈ గ్రామం ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 300 వందల ఏళ్ల నాటి గన్నేరు పూల చెట్టు ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు. ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలిపే తాళపత్ర గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. మొఖాసా గ్రామంగా ఉన్న ఈ పల్లె చాలాకాలం పాటు దొరల జమానాగా ఉంది. పద్మనాయక వెలమ సామాజికవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు ఈ గ్రామంలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆయన ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకునేవారు. అలాగే ఆయన కుమారుడు వెంకటరావు ఎమ్మెల్యే హోదాలో పలుమార్లు ఇక్కడకు వచ్చారు. రాజకీయంగా సెంటిమెంట్గా ఈ ఆలయ దర్శనం చేస్తుంటారు. -
జగన్ పాలనలోనే నిజమైన అభివృద్ధి
త్యాగధనులు.. పోలవరం నిర్వాసితులు భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగాయని మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజేయ కల్లం అన్నారు. భీమవరంలోని పీసీఆర్ కల్యాణ మండపంలో ఓపెన్మైండ్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు’ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను కమిషనర్ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఉద్యోగానుభవం ఉందన్నారు. ప్రస్తుత వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాళ్లల్లో జరిగాయనేందుకు ఉదాహరణగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హర్బర్లు, 17 మెడికల కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు ఉన్నాయన్నారు. నేటి ప్రచారమాధ్యమాలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, వాటిని గుడ్డిగా నమ్మకుండా వాస్తవం తెలుసుకోవాలని హితవు చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలియచేయడానికే ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సమాజంలోని మేధావులు, అధ్యాపకులు, డాక్టర్లు, న్యాయవాదులు, విద్యార్థులతోపాటు సమాజంలోని ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగులంతా గ్రహించాలన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.మూడువేల కోట్లు పెట్టుబడులు వస్తే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. అలాగే రాష్ట్రంలోి 311 భారీ పరిశ్రమలు రావడంతో 2014–19లో పారిశ్రామికాభివృద్ధి రేటు 3.2 శాతం ఉండగా, 2019 నుంచి 2024 మధ్య 12.8 శాతానికి పెరిగిందని వివరించారు. అంతేగాకుండా రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రానికి కొత్తగా 3.69 లక్షల ఎంఎస్ఈల ద్వారా 25 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.1,800 కోట్లతో అభివృద్థి చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిందన్నారు. అలాగే రూ.1,600 కోట్ల వ్యయంతో ఆస్పత్రులను అభివృద్ధి చేశారన్నారు. నిజాలు తెలుసుకోవాలి : అభివృద్ధి అంటే కనిపించే నాలుగు భవనాలు మాత్రమే కాదని, పేదరికం తగ్గుదల, మహిళ సాధికారత, తలసరి ఆదాయం పెరుగుదల, ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఓపెన్మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి అన్నారు. సెమినార్లో ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో, ప్రస్తుతం వైఎస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిపై విద్యావంతులు, మేధావులు ఓపెన్మైండ్తో చర్చించి వాస్తవాలను ప్రజలకు తెలియాజేయాలన్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని తప్పుడు సందేశాలు, సమాచారాలను ప్రచారం చేస్తున్నవారు నిజాలు తెలుసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగులు కల్పించారన్నారు. అలాగే 31 లక్షల మందికి 68,700 ఎకరాల భూమిని ఇళ్లు స్థలాలుగా పంచారన్నారు. ఇళ్లస్థలాల కోసం రూ.75,670 కోట్లు ఖర్చు చేశారన్నారు. కుక్కునూరు: రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గురువారం ఆయన పోలవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలకి్ష్మ్తో కలిసి కుక్కునూరు మండలంలోని ఇసుకపాడు, లంకాలపల్లి, మంజంవారిగుంపు, నల్లకుంట, కుక్కునూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో బాలరాజు, రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్అండ్ఆర్ సర్వేలో అవగాహన రాహిత్యంతో సర్వే నిర్వహించడంతో ముంపులో ఉన్న భూములకు పరిహారం అందలేదని, ముంపునకు గురయ్యే గ్రామాలను ముంపులో లేనట్టు పేర్కొనడం జరిగిందన్నారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విషయాలన్నీ తనకు తెలుసునని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంతో పోరాడుతూ ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వస్తున్నారన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగానే నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందన్నారు. నిజాయతీ గల వ్యక్తి కనుకనే గత వరదల సమయంలో గొమ్ముగూడెం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభాముఖంగా కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లనే మాట నిలబెట్టుకోలేకపోయానని బహిరంగంగా నిర్వాసితులకు వెల్లడించారన్నారు. కానీ నిర్వాసితులకు జగనన్న తప్పక న్యాయం చేస్తారని అన్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీలను ఏ విధంగా అయితే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారో, నిర్వాసితుల విషయంలో కూడా అదే విధంగా మాట నిలబెట్టుకుంటారని, దీనిపై ఎటువంటి సందేహం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుక్కునూరు పంచాయతీ పరిధిలో ప్రతి వీధి తిరిగి పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరోసారి పోలవరం గడ్డమీద వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కుంజా నాగేశ్వరరావు, ఎంపీపీ చేబ్రోలు గీతావాణి, సర్పంచ్ రావు మీనా, వైస్ ఎంపీపీలు గాడిద రామచంద్రం, తాండ్ర రాజేష్, ఎంపీటీసీలు సోడే సాధు, కుండా సూరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గంగుల రమణారెడ్డి, మాదిరాజు వెంకన్నబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహారాజు, రావు వినోద్, రామిరెడ్డి, ఆవుల బాలకృష్ణారెడ్డి, కోటగిరి నళిని ప్రవార్, రాయి రవి, మల్లెల చంటి నాయుడు, సుర్ల రాము, కో–ఆప్షన్ సభ్యుడు సలీం పాషా పాల్గొన్నారు. ముగిసిన రైల్వే వారోత్సవాలు భీమవరం (ప్రకాశంచౌక్): ప్రపంచలోనే అతి పెద్ద వ్యవస్థగా భారతదేశ రైల్వేస్ నిలిచిందని, ప్రయాణికుల సౌకర్యాల కోసం స్టేషన్లను కూడా ఆధునికీకరణ చేశారని భీమవరం పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏంవీ రమణ అన్నారు. రైల్వే వారోత్సవాల ముగింపులో భాగంగా భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో హమాలీలకు, కూలీలకు నూతన వస్త్రాలను శ్రీవిజ్ఞానవేదిక, జంక్షన్ టౌన్ రైల్వేస్టేషన్ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు ఆర్థిక సహాయంతో 25 మంది హమాలీలకు, ఆరుగురు స్వీపర్లకి నూతన వస్త్రాలు అందించారు. టౌన్ స్టేషన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సీసీఎస్ టి.ఉదయిని, రైల్వే సీఆర్పీఎఫ్ దస్తగిరి పాల్గొన్నారు.స్థానిక వార్తలువిద్యా విధానంపై అవగాహన అవసరం భీమవరం: విద్యార్థులు విద్యావిధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ్కల్లాం అన్నారు. భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు అనే అంశంపై ఆయన మాట్లాడారు. నేటి ప్రభుత్వం విద్యావిదానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతిస్థితికి చేరాలన్నారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ సీఈవో డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను తల్లిదండ్రులకు పూర్తిగా తెలియచేయాలన్నారు. విద్యలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యతో మెరుగైన అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ పి.విజయబాబు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రొ, చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి అద్భుతం అభివృద్ధిపై వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ప్రచారా సాధనాలు ఉపయోగించుకుని చేస్తున్న గ్లోబెల్ ప్రచారానికి మేధావులు, విద్యార్థులు తెరదించాలని ఆర్టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార బాషా కమిషనర్ పి.విజయబాబు అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అద్భుతంగా జరిగిందన్నారు. రూ.వేల కోట్లు మానవ వనరుల అభివృద్ధికి, ఇన్ఫ్రా డెవవల్మెంట్కి ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయి అభివృద్ధికి ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని పేరిట రూ.వేల కోట్ల ఖర్చుతో భవనాలు నిర్మించగా ప్రధానంగా సచివాలయం భవనాలు చూస్తే ప్రతి గోడ బీటలు వారి ఉంటాయనే విషయం ప్రజలకు తెలియదన్నారు. పేదల పిల్లలు నేడు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదవి ఉన్నత ఉద్యోగులు సాధిస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసి మద్దతుగా మాట్లడం లేదని జరిగిన అభివృద్ధి చూసి వాస్తవం చర్చించామని పి.విజయబాబు స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి లభిస్తేనే నిజమైన అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగింది తప్పుడు సందేశాలు, ప్రచారాలు నమ్మకూడదు.. నిజం తెలుసుకోవాలి చంద్రబాబు హయాంలో కంటే జగన్ పాలనలో అప్పులు తక్కువే పేదరికం రేషియో కూడా తగ్గింది.. అన్నింటికీ గణాంకాలున్నాయి భీమవరంలో ఓపెన్మైండ్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు’ సెమినార్లో మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం రాష్ట్రం కోసం సర్వస్వం త్యాగం చేశారు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం జగనన్న తప్పక న్యాయం చేస్తారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి కుక్కునూరు మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చదువుకు అక్కరకు వస్తున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు పేద విద్యార్ధుల కుటుంబాలను ఆదుకుంటున్నాయి. ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును తల్లుల బ్యాంక్ ఖాతాల్లో గాకుండా కళశాల మెనేజేమెంట్ ఖాతాలో జమ చేయాలి. – ఎన్.సుస్మిత, బీటెక్ విద్యార్థిని, ఎస్ఆర్కేఆర్ కళాశాల, భీమవరం పీజీకి కూడా వర్తింపజేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ పీజీ కోర్సు కూడా కల్పిస్తే పేద విద్యార్ధులు మరింత ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అన్ని విద్యాసంస్ధల్లో టెక్నికల్, స్కిల్స్ కలిగిన సిలబస్లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించడం చాలా మంచి కార్యక్రమం. – బి.ధరణి, డిగ్రీ విద్యార్థిని, సీఎస్ఎన్ కళాశాల, భీమవరం వ్యవసాయం పండగ చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగ చేసింది. స్కూల్స్ల్లో ఉచితంగా అందిస్తున్న విద్యామెటీరియల్ పేదలకు ఎంతగానో ఉపయోగం. దీనివల్లనే మన విద్యార్ధులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయం. – మేడిది జాన్సన్, బ్రౌనింగ్ జూనియర్ కళాశాల సెక్రటరీ, భీమవరం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి నాడు–నేడు పధకం ద్వారా గ్రామస్ధాయిలో పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం, సోషల్ ఇంజనీరింగ్పై దృష్టిపెట్టింది. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. 40 వేల వైద్యపోస్టులను భర్తీ చేయడం అభినందనీయం. ప్రజల వద్దకే ప్రభుత్వ పధకాల వల్ల లంచాల బాధ లేదు. – ఎ కృష్ణమోహన్, రిటైర్డ్ లెక్చరర్, భీమవరం డీఎన్నార్ కళాశాల -
No Headline
విద్యా విధానంపై అవగాహన అవసరం భీమవరం: విద్యార్థులు విద్యావిధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ్కల్లాం అన్నారు. భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు అనే అంశంపై ఆయన మాట్లాడారు. నేటి ప్రభుత్వం విద్యావిదానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతిస్థితికి చేరాలన్నారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ సీఈవో డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను తల్లిదండ్రులకు పూర్తిగా తెలియచేయాలన్నారు. విద్యలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యతో మెరుగైన అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ పి.విజయబాబు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రొ, చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
నూజివీడులో ఎమ్మెల్యే కుమారుడి ప్రచారం
నూజివీడు: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటు వేసి కష్టాలు తెచ్చుకోవద్దని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. పట్టణంలోని 29వ వార్డులో బుధవారం రాత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల సంక్షేమానికి, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడ్డారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రతాప్ అప్పారావు వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావును, కారుమూరి సునీల్కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ, పార్టీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యన్నారాయణ, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కోటగిరి పూర్ణిమ, క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు పిళ్లా చరణ్ పాల్గొన్నారు. -
ఫ్యాన్స్లో ఫుల్ జోష్
● జగమంతా.. రామమయం సీతారాముల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం.. అన్నట్టుగా శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఊరూవాడా సీతారాముల కల్యాణోత్సవాలతో సందడి నెలకొంది. ద్వారకాతిరుమల క్షేత్రంతో పాటు ప్రముఖ ఆలయాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించారు. రథోత్సవాలు, అన్నసమారాధనలు జరిగాయి. – సాక్షి నెట్వర్క్ ఉండిలో మూడు చక్రాల సైకిల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదావరిని తలపించింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు మండుటెండను లెక్కచేయకుండా ఊళ్లకు ఊళ్లే రోడ్లపైకి వచ్చాయి. పొద్దుపోయినా వేచి ఉండి జన నీరాజనం పట్టాయి. జై జగన్ అంటూ నినదించాయి. యువత ప్రదర్శించిన ఫ్లకార్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిల్లాలో బస్సు యాత్ర, భీమవరం బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్జోష్ నింపగా, మరోపక్క కూటమి గుండెల్లో దడ పుట్టిస్తోంది. నేడు తణుకులో పర్యటన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం తణుకు నియోజకవర్గంలో జరుగనుంది. ఉదయం 9 గంటలకు తేతలిలోని నైట్ హాల్ట్ క్యాంపు వద్ద నుంచి బయలుదేరి తణుకు క్రాస్ మీదుగా సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటారు. నియోజకవర్గంలో యాత్ర విజయవంతానికి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
19న ముదునూరి ప్రసాదరాజు నామినేషన్
నరసాపురం: నరసాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాదరాజు ఈనెల 19న శుక్రవారం నామి నేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలు నుంచి మొగల్తూరు మండలం పాతపాడు నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నరసాపురం సబ్కలె క్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చే స్తారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ముందున్న ముదునూరి నామినేషన్ ప్రక్రియను ముగించుకుని ప్రచార కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఓపెన్ మైండ్స్ ఫర్ బెటర్ సొసైటీ సదస్సు భీమవరం: భీమవరంలో గురువారం ఓపెన్ మైండ్స్ ఫర్ బెటర్ సొసైటీ సెమినార్ నిర్వహించనున్నట్టు ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ పి.సంజీవరావు తెలిపారు. పట్టణంలోని పీపీ రోడ్డులోని పీసీఆర్ కాంప్లెక్స్లో ఉదయం 10 గంటలకు సెమినార్ ప్రారంభమవుతుందని, ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు అనే అంశంపై ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ అండ్ ఓపెన్ మైండ్స్ ప్రెసిడెంట్, మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి ప్రసంగిస్తార న్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లాం, మాజీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ పి.విజయబాబు, డీఎన్నార్ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్, బీహెచ్ రామకృష్ణంరాజు, భీమ వరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేడిది జాన్సన్, కేజీఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ హాజరవుతారని సంజీవరావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య భీమవరం: జిల్లాలో రైతుల నుంచి దాళ్వాలో ధాన్యాన్ని పూర్తిస్థాయి లో కొనుగోలు చేయడానికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. క్వింటాల్ ధర ఏ– గ్రేడ్ రూ.2,203, సాధారణ రకం రూ.2,183గా నిర్ణయించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, వీటిని రైతులే ఏర్పాటు చేసుకుంటే ఖర్చులను కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయిలో ధాన్యం సేకరణ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం సేకరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోలు రూములు ఏర్పాటు చేసి సమస్యలు పరి ష్కరిస్తామని జేసీ తెలిపారు. అలాగే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో ఫోన్ 81216 76653 అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 306 రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 125 ధాన్యం కొనుగోలు సహాయ కేంద్రాల ద్వారా రైతుల నుంచి 18,528 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సివిల్స్లో సత్తాచాటిన ఏపీ నిట్ విద్యార్థి తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం ఏపీ నిట్ పూర్వ విద్యార్థిని గోవాడ నవ్యశ్రీకి సివిల్స్లో జాతీయస్థాయి లో 995 ర్యాంకు సా ధించారు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ఆమె సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో నాలుగో ప్రయత్నంలో ఆమె సివిల్స్లో విజయం సాధించారు. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రీన్ వ్యాలీ, తండ్రి ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ కాగా, తల్లి గృహిణి. ఈమె ఏపీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వైద్యారోగ్యశాఖలో అడ్మిన్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఆమెను ఏపీ నిట్ ఇన్చార్జి డాక్టర్ బీఎస్ మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్రెడ్డి, వి.సందీప్, టి.రమేష్ తదితరులు అభినందించారు. -
No Headline
ఆకివీడు: ఆ నియోజకవర్గంలో మూడు చక్రా ల సైకిల్ గమ్యం లేకుండా తిరుగుతోంది. మూడు చక్రాలూ ఎదురెదురుగా తిరుగుతుండటంతో ప్రయాణం ఒక్క అడుగూ ముందుకు సాగని పరిస్థితి. ఆ మూడు చక్రాలకూ ముగ్గురు ప్రతినిధులుగా ఉన్నారు. ఒకరికి సీ టు ఖరారవగా.. మరొకరు సీటివ్వలేదని రెబెల్ గా పోటీ చేస్తా నంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరొకరు ఎంపీ సీటు ను ఆశించి.. భంగపడి.. ఇప్పుడు అసెంబ్లీ సీటులో అయినా పోటీ చేయాలనే తలంపుతో ఇటు కన్నేసిన పరిస్థితి. ఇక సీటు ఖరారైన అభ్యర్థి పరిస్థితి మరీ దారుణంగా మారింది. పోటీకి సిద్ధమవుదామంటే.. సీటు దక్కక రెబెల్గా బరిలో దిగుతానంటూ వ్యతిరేక ప్రచారం చేస్తున్న నాయకుడు ఒక పక్క.. అసలు తన సీటుకే ఎసరు పెట్టేందుకు పావులు కదుపుతున్న మరో నేత ఇంకోపక్క.. నామినేషన్ల దశ కూడా మొదలైపోతున్న దశలో ఎటూ తేలని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇ దంతా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీ డీపీ దుస్థితి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు తొలి జాబితాలో సీటు దక్కగా.. అది తన నియోజకవర్గమని, గతంలో తాను త్యాగం చేసిన ఆ స్థానాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్టిన నేత శివరామరాజుకు నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న శివరామరాజు రెబెల్గా బరిలో దిగుతానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నరసాపురం ఎంపీ స్థానాన్ని ఆశించి తీవ్ర భంగపాటుకు గురైన కనుమూరి రఘురామకృష్ణరాజు.. ఉండి అసెంబ్లీ స్థానంలో అయినా పోటీ చేయా లని చంద్రబాబును ఒప్పించేందుకు శతవిధా లా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకూ రెండు చక్రాలతోనే తలలు పట్టుకుంటున్న ఆ పార్టీ కేడర్కి.. కొద్దిరోజులుగా మూడు చక్రాల సైకిల్ మాదిరిగా పరిస్థితి మారడంతో ఎవరికి టికెట్ ఇస్తారో.. ఎవరి వెనుక తిరగాలో.. ఎవరు పోటీలో ఉంటారో అర్థంగాక అయోమయంలో ఉన్నారు. ఆయన (శివరామరాజు)కు ఈయన (మంతెన రామరాజు) వెన్నుపోటు.. ఈయన (మంతెన రామరాజు)కు ఆయన (శివరామరాజు) వెన్నుపోటు.. ఆయన (శివరామరాజు), ఈయన (మంతెన రామరాజు)కు అతని (రఘురామకృష్ణరాజు) వెన్నుపోటు.. అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. వెన్నుపో టు పార్టీకి వెన్నుపోటు తప్పదని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు. అదండీ సంగతి! -
ప్రచారంలో వైఎస్సార్ సీపీ దూకుడు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ దూసుకెళుతోంది. ఓ వైపు అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరికీ రెండు ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఓటర్లను కోరుతున్నారు. సీఎం వైఎస్ జగనపాలనలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓట్లు అభ్యర్థించిన మంత్రి కొట్టు తనయుడు తాడేపల్లిగూడెం అర్బన్: జగన్ సంక్షేమ పాలన కోరుకునే వారందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు రాజేష్ అన్నారు. తాడేపల్లిగూడెం 12వ వార్డులో రాజేష్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ తన త్రండి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉంటేనే తాడేపల్లిగూడెంలో రౌడీయిజం, గుండాయిజం అదుపులో ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణను గెలపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ 12వ వార్డు ఇన్చార్జి చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీను, బోణం విజయనిర్మల ఉన్నారు. పాలకొల్లు అర్బన్: పేదల బాగు కోసం కృషి చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని, వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పాలకొల్లు 12, 16 వార్డుల్లో బుధవారం గుడాల గోపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పెద్దలను ఆశీర్వదించాలని కోరారు. విద్య, వైద్య రంగాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వేలాది కోట్లు వ్యయం చేసి పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చారన్నారు. వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకు పాలన అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం జగన్ను మరోసారి సీఎం చేయాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తానన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఇంటి స్థలాలు మెరక, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయకుండా ఇలా ప్రతి అభివృద్ధి పనిలో అడ్డుతగిలిన ఎమ్మెల్యే నిమ్మలను ఇంటికి సాగనంపాలని కోరారు. టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషుబాబు, వైఎస్సార్ సీపీ చింతలపూడి పరిశీలకులు గుణ్ణం నాగబాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, మండల పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత చిట్టూరి ఏడుకొండలు, పార్టీ నాయకులు గుణ్ణం సర్వారావు, వీరా శ్రీనివాసరావు, కుంచిలపల్లి వినిస్టన్బాబు, మద్దా చంద్రకళ, కర్రా జయసరిత పాల్గొన్నారు. -
పీడీ యాక్ట్ కింద నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: పదే పదే నేరాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన నలుగురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ యు.రవిచంద్ర బుధవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణం, పరిసర గ్రామాల్లో చట్టంపై గౌరవం లేకుండా పదే పదే నేరాలకు పాల్పడుతూ నేరప్రవృత్తిని కలిగి, తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించామన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు వీరిని ఆంధ్రప్రదేశ్ అక్రమ సారాదారులు, బందిపోట్లు, మాదకద్రవ్యాల నేరస్తులు, గూండాలు, భూఆక్రమణదారులు, డబ్లింగ్ కరెన్సీ తదితర అపాయకర కార్యకలాపాల నిరోధక చట్టం (పీడీ యాక్ట్) కింద వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరైస్టెన వారిలో పట్టణానికి చెందిన కోడూరి రవితేజ (ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం), కోన శ్రీనివాస్ అలియాస్ పెప్పీ నాని, మద్దిపాటి కల్యాణ్, షేక్ నాగూర్ మీరావల్లీ అలియాస్ బబ్లూ ఉన్నారు. కోడూరి రవితేజపై ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 13 కేసులు, కోన శ్రీనివాస్పై జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, ఏలూరు, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 9 కేసులు, మద్దిపాటి కల్యాణ్పై జంగారెడ్డిగూడెం, తడికలపూడి, నల్లజర్ల, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లలో మొత్తం 10 కేసులు, షేక్ నాగూర్ మీరావల్లీపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, నల్లజర్ల పోలీస్స్టేషన్లలో మొత్తం 4 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నలుగురితో పాటు మరికొంతమంది కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 21న నల్లజర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఒక బంగారు వ్యాపారిని అడ్డగించి దోచుకున్నారని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ప్రస్తుతం వీరు ఏలూరు జైలులో రిమాండ్లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ పి.రాజేష్, ఎస్సై పి.జ్యోతిబాస్ పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడి -
కారుమూరి గెలుపు కోరుతూ అల్లుడి ప్రచారం
తణుకు టౌన్: త్వరలో జరిగే సాధారణ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అల్లుడు దిలీప్ బుదవారం సాయంత్రం తణుకు పైడిపర్రు ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిచారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికలలో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను గెలిపించాలని కోరారు. ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి శివశంకర్, పట్టణ సచివాలయాల కన్వీనర్ ఇండుగపల్లి బలరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, నాయకులు కొత్తపల్లి చరణ్, డీ హేమ శ్రీలత, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి
జంగారెడ్డిగూడెం రూరల్: రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. మండలంలోని ఎ.పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాల్లో బుధవారం విజయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు హారతులిస్తూ విజయరాజుకి ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. విజయరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చారన్నారు. మున్ముందు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్ బుద్దాల సీతారామరాజు, జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పార్టీ నాయకులు గురజాల పార్థసారథి, మల్నీడి బాబి, బెజవాడ నాగరాజు, బండారు వెంకట సుబ్బారావు, ముప్పిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జగన్ పాలనలోనే బీసీలకు సముచిత స్థానం
తాడేపల్లిగూడెం బీసీల ఆత్మీయ సమావేశంలో వక్తలు తాడేపల్లిగూడెం అర్బన్: బీసీలకు రాష్ట్ర స్థాయిలో సముచితస్థానం కల్పించి, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్నే మళ్లీ గెలిపిస్తామని బీసీ సంఘాల నాయకులు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం బీసీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలవురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం బీసీలను గుర్తించలేదన్నారు. తమకు వేతనాలు పెంచాలని ఒక బీసీ ఉద్యోగి గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని కోరితే ఎక్కువగా మాట్లాడితే బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు నాయుడు అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అవమానించిన టీడీపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే బీసీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎమ్మెల్సీలు, హోంశాఖ మంత్రి, ఆర్అండ్బీ శాఖ మంత్రి పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నత స్థాయిని కల్పించి బీసీల గౌరవాన్ని పెంచారన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి అవసరమైన సేవలు అందిస్తూ వచ్చానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా, దేవదాయ శాఖ మంత్రిగా తనకు రెండు పదవులిచ్చి కాపుల గౌరవాన్ని పెంచారన్నారు. తన వల్ల లబ్ధి పొందిన కొందరు జనసేన పార్టీలో చేరి ఏదో చేస్తారని చెబుతున్నారని వారికి తగిన గుణపాఠం చెబుతానని మంత్రి హెచ్చరించారు. బీసీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి కొట్టు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న కామన రంగబాబు తాడేపల్లిగూడెం మండలం, కొండ్రప్రోలు గ్రామ బీసీ నాయకులు కామన రంగబాబు బుధవారం మంత్రి కొట్టు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. రంగబాబుకు మంత్రి కొట్టు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రంగబాబు గతంలో టీడీపీ బీసీ నాయకునిగా ఉన్నారు. జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై వైఎస్సార్ సీపీలో చేరానని, పార్టీ గెలుపునకు, మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని రంగబాబు తెలిపారు. ఎంపీపీ దాసరి హైమావతి, ముద్రగడ లలితకుమారి, గుండబోగుల నాగు, కొలుకులూరి ధర్మరాజు, చిటికన ప్రసాద్, కట్టుబోయిన కృష్నప్రసాద్, చెన్నా జనార్దన్, గుండుమోగుల బలుసులు, తాతా శ్రీనివాస్, కర్నాటి కన్నయ్య, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
రాములోరి సాక్షిగా ప్రత్యర్థుల కలయిక
బాబాయ్ అబ్బాయ్ కలిశారు.. ఇక చూడు నా రాజా.. తాడేపల్లిగూడెం : ఆ నేతలిద్దరూ రక్త సంబంధీ కులు కారు.. కానీ వరుసకు బాబాయ్.. అబ్బాయ్. అంతేకాదు.. రాజకీయంగా ఇటీవల కాలం వరకు వారు ప్రత్యర్థులు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకరు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. మరొకరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కొద్ది తేడాలో పరాజయం పాలయ్యారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మరొకరు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. కొట్టు సత్యనారాయణకు ఈలి నాని వరుసకు బాబాయ్.. నానికి కొట్టు సత్యనారాయణ వరుసకు అబ్బాయ్ అవుతారు. అలాగే ఆత్మీయంగా పిలుచుకుంటారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉన్న ఈలి నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా నాని సీఎంను కలిశారు. కొట్టు సత్యనారాయణ, ఈలి నాని ఇద్దరూ నారాయణపురం నుంచి భీమవరం వరకు కలిసి ప్రయాణం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణను సీఎం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన విజయానికి ఈలి నాని కూడా కృషి చేయనున్నారు. వీరిద్దరూ పెంటపాడు మండలం కస్పా పెంటపాడులోని బైరాగిమఠంలో బుధవారం జరిగిన శ్రీరామనవమి కల్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. వీరిద్దరిని చూసినవారు ‘బాబాయ్ అబ్బాయ్ కలిశారు.. ఇక చూడు నా రాజా.. రాజకీయం..’ అంటున్నారు. పాలకొల్లు అర్బన్: రాజకీయంగా వారిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన ప్రత్యర్థులు. సీతారాముల కల్యాణ వేదిక సాక్షిగా ఒకరికొకరు తారసపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాలకొల్లులోని గుత్తులవారిపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన సీతారాముల కల్యాణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. చేతులు కలిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని అంగరను గుడాల గోపి కోరడంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ నాయకుడు అడబాల వెంకటరమణ జోక్యం చేసుకుని ఈసారి రామమోహన్ మనకే మద్దతిస్తారనడంతో అక్కడి ఉన్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. అనంతరం వీరిని ఆలయ కమిటీ అధ్యక్షుడు జోగి వెంకటేశ్వరరావు సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. -
25న గురుకుల ప్రవేశ పరీక్ష
ముసునూరు: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు, ఏలూరు జిల్లా కన్వీనర్, ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, 5, 6, 7, 8 తరగతులు, ఏపీఆర్ఎస్ కాట్–2024 విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలకు వరకు ఏపీఆర్జేసీ, డీసీ సెట్–2024 విద్యార్థులకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, పోస్ట్ ద్వారా ఇంటికి పంపడం ఉండదని అభ్యర్థులకు ఆమె సూచించారు. -
కూటమివి అన్నీ బూటకపు మాటలే
రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ద్వారకాతిరుమల : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చెబుతున్న బూటకపు మాటలను ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని పి.కన్నాపురం, శరభాపురం, సత్తాల, సండ్రకుంట, తక్కెళ్లపాడు, గుణ్ణంపల్లి, మహదేవపురం గ్రామాల్లో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రి వనితకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. పి.కన్నాపురంలోని రామాలయాన్ని సందర్శించి, సీతారాములకు పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ పేదలను పట్టించుకోలేదన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు జనసేన, బీజేపీలను కలుపుకుని ప్రజలకు మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా జగనన్నను ఢీకొట్టే మగాడే లేడని ఆమె గళమెత్తారు. జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భవిష్యత్తులో మరింత సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాలన్నారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే వారు చేసే అరాచకాలకు అడ్డూ, అదుపు ఉండదన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని ఓడించాలన్న తపనే తప్ప, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం కూటమికి ఏమాత్రం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మన పేదల పార్టీని గెలిపించుకుని, మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందామన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబు, ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, సర్పంచ్లు దాసరి సుబ్బలక్ష్మి, కొండాబత్తుల సుభద్ర, పెద్దిన దిలీప్, నున్న పద్మ, కొప్పిశెట్టి గంగ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, మానుకొండ కన్నయ్య, చెరుకూరి ప్రసాదరావు, వామిశెట్టి పరమేశ్వరరావు, ఆచంట సురేష్, కారుమంచి రమేష్, దాసరి రాంబాబు, కుక్కల గట్టియ్య, తోలేటి వెంకట సుబ్బయ్య తదితరులున్నారు. మేమంతా సిద్ధం సభలతో కూటమి నేతల్లో వణుకు భీమవరం: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తుంటే కూటమి నేతల వెన్నుల్లో వణుకు పుడుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. బుధవారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు జీర్ణించుకోలేక డబ్బులిచ్చి తీసుకువస్తున్నారని చిల్లర జనమంటూ అవాకుచవాకులు పేలడం దుర్మార్గమన్నారు. మరోసారి వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారని మంగరాజు స్పష్టం చేశారు. -
No Headline
సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 16వ రోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ దారిలో ముందురోజు నుంచే పండగ వాతావరణం కనిపించింది. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు బస్సుయాత్ర సాగే రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జగన్ రాక కోసం ఎదురుచూడటం కనిపించింది. అడుగడుగునా బస్సు ఆపి చిన్నారులు, వృద్ధులు, మహిళలు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ.. సీఎం జగన్ ముందుకు సాగారు. వేయి కళ్లతో ఎదురుచూసి.. భీమవరం బహిరంగ సభ అనంతరం రాత్రి తేతలి లో రాత్రి బస క్యాంపునకు సీఎం జగన్ చేరుకున్నా రు. రాత్రి 8 గంటలకు తేతలి వద్దకు చేరుకోవాల్సి ఉండగా వెల్లువెత్తిన జనప్రవాహంతో పర్యటన రెండు గంటల ఆలస్యంగా సాగింది. అయినా ఆయన రాక కోసం ఊళ్లకు ఊళ్లే రోడ్లపైకి వచ్చాయి. చిన్నాపెద్దా అంతా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లకు చేరుకుని జననేత కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. పలు కూడళ్ల వద్ద సీఎం జగన్ బస్సుపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తూ వారిలో ఉ త్సాహం నింపారు. జగన్ బాబు నన్ను పలకరించారని, ఆరోగ్యం జాగ్రత్తని చెప్పానని వృద్ధులు, జగనన్నతో సెల్ఫీ తీసుకున్నానంటూ యువతీ యువకులు, నాకు నుదుటన ముద్దుపెట్టారంటూ చిన్నారులు, సమస్యను ఆలకించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఫోన్ చేయమని నంబర్ ఇచ్చారంటూ అర్జీదారులు సంభ్రమాశ్చర్యాలకు గురికావడం దారిపొడవునా కనిపించింది. గాయాన్ని చూసి చలించిన హృదయాలు హత్యాయత్నం ఘటనలో సంక్షేమ సారథి నుదుటన అయిన గాయాన్ని చూసి చలించని హృదయం లేదు. జిల్లావాసులతో పాటు కర్నూలు, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి అభిమానులు తరలివచ్చి దారిలో ఆయన్ను పలకరించి వెళ్లారు. మా కోసం కష్టపడుతున్న మీకు ఎంత ఆపద వచ్చిందంటూ వృద్ధులు ఆవేదన చెందారు. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా ఉంటాయని, దాడిచేసిన దుర్మార్గులకు దేవుడే తగిన శాస్తి చెస్తాడంటూ ధైర్యం చె ప్పారు. గాయం త్వరగా నయం కావాలని వృద్ధులు, ఆరోగ్యం జాగ్రత్త అన్న అంటూ మహిళలు ఆప్యాయత చూపించారు. వినూత్న ప్ల్లకార్డులతో.. బస్సు యాత్రతో పాటు భీమవరం బహిరంగ సభలో అభివృద్ధి ప్రధాతపై వినూత్న ప్ల్లకార్డులను ప్రదర్శిస్తూ యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిద్ధం.. ఇకపై యుద్ధం, మ్యాన్ ఆఫ్ మాస్, ఏపీ కింగ్, రాజ్యం మాదే.. పాలన మాదే, కింగ్ ఆఫ్ ఆంధ్ర, పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు అంటూ యువత ప్రదర్శించిన ప్ల్లకార్డుల చిత్రాలతో ‘వెస్ట్గోదావరి ఫ్యానిజం అంటే మినిమం ఉంటాదంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. కూటమి ఆశలపై నీళ్లు చల్లుతూ జిల్లాలో బస్సుయాత్ర విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. సీఎం జగన్ బస్సు యాత్ర, బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల్లో వణుకు పుట్టింది. వైఎస్సార్సీపీలో నవోత్సాహం సీఎం జగన్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ వెల్లువలా తరలివచ్చిన జనం మండుటెండను లెక్కచేయని వైనం జననేత కోసం ఎదురుచూసిన ఊళ్లు రెట్టించిన ఉత్సాహంలో పార్టీ శ్రేణులు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement