అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షలు ఇస్తాం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షలు ఇస్తాం

Published Thu, Mar 23 2017 3:54 PM

అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 105 కుటుంబాల వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు చేస్తామని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి వాళ్లకు ఇస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఇతర వామపక్షాల నాయకులతో కలిసి వెళ్లిన ఆయన.. అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే...