నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్ | Sakshi
Sakshi News home page

నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్

Published Sat, Jul 22 2017 3:08 PM

సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్‌ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ప్రముఖ నటుడు తరుణ్‌ అన్నారు. తన తండ్రి చక్రపాణితో కలిసి నేటి ఉదయం ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హీరో తరుణ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కు సంబంధించి డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్‌ కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన సిట్ బృందం ప్రముఖ డ్రగ్ డీలర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలపై నేటి ఉదయం పది గంటల నుంచి సిట్ అధికారులు తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో తరుణ్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.