గగనతలంలో తప్పిన పెను ప్రమాదం | Sakshi
Sakshi News home page

గగనతలంలో తప్పిన పెను ప్రమాదం

Published Sun, Feb 19 2017 7:41 PM

జర్మనీ గగనతలంలో జెట్‌ఎయిర్‌వేస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్‌ బయలుదేరిన బోయింగ్‌777 విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జర్మనీ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన రెండు ఫైటర్‌ జెట్‌లు బోయింగ్‌777 విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించారు. చివరకు క్షేమంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది.

Advertisement
Advertisement