అవన్నీ నేరమే: అకున్‌ సబర్వాల్ | Sakshi
Sakshi News home page

అవన్నీ నేరమే: అకున్‌ సబర్వాల్

Published Mon, Jul 24 2017 6:44 PM

డ్రగ్స్‌ కేసులో స్కూల్‌ పిల్లల పేర్లు బయటపెట్టబోమని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. విద్యార్థుల్లో మైనర్లు ఉన్నారని, వారి పేర్లు బయటపెడితే జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు మహిళలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. వారు ఎక్కడ కావాలంటే అక్కడే విచారిస్తామని చెప్పారు. వీరిలో ఒకరు సిట్‌ ఆఫీసుకు వస్తామని చెప్పినట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement