300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. | Sakshi
Sakshi News home page

300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే..

Published Sat, Jun 24 2017 3:31 PM

గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను శనివారం మధ్యాహ్నానికి కూడా బయటకు తీయలేకపోయారు. తొలుత కేవలం 40 అడుగుల లోతులో పడిపోయిందని త్వరగానే రక్షిస్తారని అందరూ భావించగా.. ఆపై 70 అడుగుల లోతుకు జారిందని శుక్రవారం సమాచారం. శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నారి మీనా ఇప్పుడు 200 అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలలో కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు