సరి 'కొత్త'గా పాలన! | Sakshi
Sakshi News home page

సరి 'కొత్త'గా పాలన!

Published Sun, Oct 9 2016 6:38 AM

రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతమున్న పది జిల్లాలకు తోడు ఈ నెల 11న విజయదశమి రోజున కొత్తగా 21 జిల్లాలకు అంకురార్పణ జరుగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. చాలా చోట్ల ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యాలయాలనే కలెక్టరేట్లుగా మార్చగా.. కొన్ని చోట్ల మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలను కలెక్టర్ కార్యాలయాలుగా సిద్ధం చేసింది

Advertisement
Advertisement