-
యస్బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాది జూన్ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో స్థూల రిటైల్ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి. అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్ గణాంకాలని, త్వరలోనే జూన్ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్ తెలిపింది. అటు, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్బీఎల్ బ్యాంకు పేర్కొంది. -
యస్ బ్యాంకునకు మరో షాక్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోషాక్ తగిలింది. బాండ్లకు సంబంధించిన మోసపూరిత చర్యల పాల్పడిందంటూ యస్ బ్యాంకుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించారనేది ఆరోపణ. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న తర్వాత విచారణ జరపగా, ఏటి-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది. 2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యకాలంలో వీటిని విక్రయించినట్టు సెబీ తెలిపింది. యస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్లోని 1300 మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించిందనీ, ఆయా పెట్టుబడులను సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండా రిస్కీ బాండ్లలోకి మార్చి విక్రయించిందని ఆరోపించింది. అధిక రాబడుల పేరుతో బ్యాంకు ఉద్యోగులు మోసంగించారని సెబీ నిర్ధారించింది. తద్వారా 70,80,90 ఏళ్ల వయసున్న చాలామంది వినియోగదారులు ప్రభావితమయ్యారని వాదించింది. ఫలితంగా యస్ బ్యాంక్ ప్రవేట్ వెల్త్ మేనేజ్మెంట్కి చెందిన వివేక్ కన్వర్పై కోటి రూపాయలు, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలా రూ.50లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సెబీ. -
ఐసీఐసీఐ -యస్ బ్యాంక్ షేర్ల పతనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. యస్ బ్యాంక్ ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో) చేపట్టిన ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 10 శాతం డౌన్ సర్క్యూట్ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్పీవోలో భాగంగా బ్యాంక్ షేర్ల అలాట్మెంట్ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్ బ్యాంక్ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. -
మళ్లీ కుప్పకూలిన యస్ బ్యాంక్ షేరు
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో)కు ధరను నిర్ణయించే ముందురోజు అంటే ఈ నెల 9న యస్ బ్యాంక్ కౌంటర్లో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో షేరు 10 శాతం పతనమైంది. ఇదే రోజు కొంతమంది ఇన్వెస్టర్లు నెల రోజులకుగాను ఎస్ఎల్బీఎం(షేర్లను అరువు తెచ్చుకోవడం)ద్వారా దాదాపు 96 లక్షల యస్ బ్యాంక్ షేర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. షేరుకి రూ. 7 వడ్డీ రేటులో తీసుకున్న వీటి విలువ రూ. 5.9 కోట్లుకాగా.. ఆగస్ట్ 6న సెటిల్మెంట్ గడువు ముగియనుంది. మరుసటి రోజు బ్యాంక్ బోర్డు ఎఫ్పీవోకు రూ. 12 ధర(ఫ్లోర్ ప్రైస్)ను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో నమోదైన ఎస్ఎల్బీఎం లావాదేవీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వెరసి శుక్రవారం(10న) సైతం నేలచూపులతో ముగిసిన యస్ బ్యాంక్ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతంపైగా కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21 వరకూ జారింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం పతనంకావడం గమనార్హం! ఈడీ దర్యాప్తు యస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో ప్రాసెక్యూషన్ ఫిర్యాదును నేడు(13న) దాఖలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్లతోపాటు.. 13 సంస్థలు, వ్యక్తులపై ఈడీ కంప్లయింట్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ నియంత్రణలోని బిలీఫ్ రియల్టర్ ప్రయివేట్ లిమిటెడ్కు గతంలో యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. కాగా.. పలు ప్రతికూల వార్తలతో ఇటీవల కొంతకాలంగా యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో యస్ బ్యాంక్ షేరు 49 శాతం దిగజారింది. -
యస్ బ్యాంక్ ఎఫ్పీవో ధర రూ. 12
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో)కు ఫ్లోర్ ధరను రూ. 12గా నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధర రూ. 26.6తో పోలిస్తే 55 శాతం తక్కువ కావడం గమనార్హం! ఎఫ్పీవో ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. తద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించాలని యస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది. రూ. 1 డిస్కౌంట్ అర్హతగల ఉద్యోగులకు యస్ బ్యాంక్ ఎఫ్పీవో ధరలో రూ.1 డిస్కౌంట్ ప్రకటించింది. ఎఫ్పీవోలో భాగంగా 1,000 షేర్లను ఒకలాట్గా కేటాయించనుంది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వెరసి రూ. 12,000 కనీస పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. యస్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారు ఎస్బీఐ రూ. 1760 కోట్లవరకూ ఈ ఎఫ్పీవోలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ఎస్బీఐ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలో ఇతర సంస్థలు టిల్డెన్ పార్క్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితరాలు సైతం ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement