-
బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం జగన్కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు. సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుంది’ అని బొత్స అన్నారు. ఇక.. చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మంతి బొత్స సత్యనారాయణ. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా.. ‘సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా?. పచ్చ కామెర్లు వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. కొన్ని పత్రికలు సిద్దం సభలకు వచ్చిన వారు గ్రాఫిక్స్ అనే భ్రమల్లో ఉన్నారు. వారినే అలాగే భ్రమల్లో ఉండమనండి. రాష్ట్రంలో బీజేపీ, జనసేన ఉందా? ఎన్నికలు తరువాత రాష్ట్రంలో టీడీపీ కూడా ఉండదు. ముడు పార్టీలు కలిసిన మాకెందుకు భయం. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా. అక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. భీమిలి నుంచి నేను ఎందుకు పోటీ చేస్తాను?’ అని బొత్స అన్నారు. -
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు నేరుగా విమానాలు
విశాఖపట్నం: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ రన్వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఇదీ చదవండి: Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే.. -
వైజాగ్ టెస్టులో గెలుపెవరిది.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టులో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో బోణీ కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు మాత్రం తొలి మ్యాచ్ ఫలితాన్నే వైజాగ్ టెస్టులోనూ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఇరు జట్లు బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోనున్నాయి. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇంగ్లండ్ను ఓడించడం అంత ఈజీ కాదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తన అమ్మమ్మ ఇలాఖాలో మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. మ్యాచ్కు ముందే ఎదురు దెబ్బలు.. ఇక రెండో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తొలి టెస్టులో గాయపడిన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా.. ఇప్పుడు వైజాగ్ టెస్టుకు దూరమయ్యారు. వారి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వారిద్దరి లేని లోటు తీర్చలేనది. ఎందుకంటే తొలి టెస్టులో జడ్డూ, రాహుల్ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా జడ్డూ బ్యాట్తో పాటు బాల్తోనూ సత్తాచాటాడు. మొదటి టెస్టులో 89 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టుకు జడ్డూ స్ధానాన్ని ఎవరూ భర్తీ చేస్తారన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న. తొలి మ్యాచ్కు బెంచ్కే పరిమితమైన కుల్దీప్కు అవకాశమిస్తారో లేదా సౌరభ్ కుమార్, వాషింగ్టన్లో ఎవరైనా జట్టులోకి వస్తారో వేచి చూడాలి. ఒక వేళ కుల్దీప్ జట్టులోకి వస్తే కేవలం బౌలింగ్ పరంగా మంచి ఎంపికైనప్పటికీ, బ్యాటింగ్లో మాత్రం అంతంత మాత్రమే. రజిత్ పాటిదార్ అరంగేట్రం..? ఇక కేఎల్ రాహుల్ స్ధానంలో రజిత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరు టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నారు. అయితే మేనెజ్మెంట్ మాత్రం పాటిదార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదైమనప్పటికీ రాహుల్ వంటి సీనియర్ ఆటగాడి స్ధానాన్ని పాటిదార్ ఎంతవరకు న్యాయం చేస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లి వచ్చేది ఎప్పుడు? ఇక తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కన్పించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నప్పుడు.. కోహ్లి వంటి ఆటగాడు జట్టులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు విరాట్ దూరమయ్యాడు. అయితే సిరీస్ మొత్తానికి కూడా విరాట్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోహ్లి సిరీస్ మొత్తానికి దూరమైతే భారత్కు కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గిల్, అయ్యర్ ఫామ్లోకి వస్తారా? రెండో టెస్టులో అందరి కళ్లు టీమిండియా ఆటగాళ్లు శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పైనే ఉంటాయి. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన వీరిద్దరూ వైజాగ్ టెస్టులోనైనా తిరిగి వారి రిథమ్ను పొందాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా టెస్టుల్లో శ్రేయస్ పర్వాలేదన్పిస్తున్నప్పటికీ.. గిల్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. మొదటి టెస్టులో కేవలం 23 పరుగులు మాత్రమే శుబ్మన్ చేశాడు. గత 9 ఇన్నింగ్స్లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. గిల్ జట్టులో తన స్ధానాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా బ్యాట్కు పనిచెప్పాల్సిందే. రికార్డు మనదే.. ఇక విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో టీమిండియా ఓటమనేదే ఎరుగదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. 2016లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (167), పుజారా (119) సెంచరీలతో . అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ సహా ఎనిమిది వికెట్లతో (మ్యాచ్లో) ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అదే విధంగా 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ 203 పరుగులు తేడాతో టీమిండియా భారీ విజయం అందుకుంది. -
విశాఖలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ...ఏర్పాట్లను పరిశీలించిన అవంతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement