-
ఈ శతాబ్దం మనదే(నా?)
భారతీయ శాస్త్ర రంగం ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి అన్న ప్రశ్నకు, ‘‘ఈ శతాబ్దాన్ని తీసుకోవలసింది ఇండియా. దాని లక్ష్యం కూడా అందుకు తగ్గకుండా ఉండాలి’’ అన్నారు థామస్ బార్లో. జర్మనీ, అమెరికా, తాజాగా చైనా తర్వాత సైన్సులో ఇప్పుడిక భారత్ వంతు. ఈ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకుంటూనే భారత్ తనదైన ప్రత్యేక నమూనాను రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ టాప్–3లో ఉండాలన్నదే మన లక్ష్యం కావాలి. మన పరిశోధనలు భారత్తో పాటు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలి. గంగానదిని సమర్థంగా శుద్ధి చేయగలిగితే... అది ప్రపంచవ్యాప్తంగా కలుషిత జలాల శుద్ధికి ఉపయోగపడుతుంది కదా! హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఇండియాసైన్స్ ఫెస్టివల్లో మేము బిడియపడకుండా ఓ ప్రశ్న వేశాం: ‘‘భార తీయ శాస్త్ర రంగం ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి?’’ మాతోపాటు చర్చలో పాల్గొన్న గ్లోబల్ ఇన్నొవేషన్ నిపుణుడు థామస్ బార్లో సమాధానమిస్తూ... ‘‘ఈ శతాబ్దాన్ని తీసుకోవలసింది ఇండియా. దాని లక్ష్యం కూడా అందుకు తగ్గకుండా ఉండాలి’’ అన్నారు. ఇదేదో యథాలాపంగా ఇచ్చిన సమాధానం కాదు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకమైన సైన్స్ మోడల్స్ పుట్టుకొచ్చిన తీరును, చరిత్రను గమనించినా ఇదే స్పష్టమవుతుంది. జర్మనీ పరిశోధనలు, టెక్నికల్ యూనివర్సిటీల ఏర్పాటు; అమెరికాలో యూనివర్సిటీ నెట్ వర్క్, పరిశ్రమతో దాన్ని అనుసంధానించడం, అంతరిక్ష, రక్షణసంస్థల ఏర్పాటు; తాజాగా కృత్రిమ మేధ, రసాయన, జీవశాస్త్రరంగాల్లో చైనా పురోగతి–– వీటన్నింటిని చూస్తే ఇప్పుడిక భారత్ వంతు. ఈ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకుంటూనే భారత్ తనదైన ప్రత్యేక నమూనాను రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రకమైన ఏర్పాటు సాధ్యమే. ఎందు కంటే... ఆర్థిక వ్యవస్థ విస్తృతి బాగా ఉంది. పరిశ్రమలు తగినన్ని ఉన్నాయి. స్టార్టప్లతో కూడిన వ్యవస్థ, మార్కెట్ వ్యాప్తి, సైన్స్ అండ్ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టేందుకు తగిన వనరులు ఉన్నాయి. కానీ భారత్కు లేనిదల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యూహంలో ఫోకస్! మన లక్ష్యం ఏమిటన్న విషయాన్ని చర్చించే ముందు మన ఆశయం ఎంత పెద్దదిగా ఉందన్నది మాట్లాడుకోవాలి. 2019లో జరిగిన మొదటి ఇండియా సైన్స్ ఫెస్టివల్లో ‘మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ లాంటి సంస్థను భారత్ ఎలా నిర్మించ గలదని ప్రశ్నించాం. దానికి సైన్స్ ఇ¯Œ స్టిట్యూట్ డైరెక్టర్ ఒకరు సమాధానమిస్తూ... భారత సైన్స్ సంస్థలు కూడా అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తున్నాయని అన్నారు. అదే రోజు మేము ఒక చైనా శాస్త్ర నిపుణుడిని చైనీస్ మోడల్ నుంచి భారత్ నేర్చుకోదగ్గ అంశాలేమిటని అడిగాం. ‘‘చైనాలో సైన్స్ పురోగమిస్తోందని ఎవరు చెప్పారు? ఎంత మంది చైనీయులకు నోబెల్ అవార్డులు వచ్చాయి? ప్రపంచాన్ని మార్చేసే ఆవిష్కరణలు మేమెన్ని చేశాం? చేయాల్సింది చాలా ఉంది’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఇరు దేశాల ఆశ యాల్లో ఉన్న వైరుద్ధ్యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది. ఆత్మ విమర్శ, ఉన్నతమైన ఆశయం, తగిన కార్యాచరణల మేళవింపుతోనే మనం సరైన ఫలితాలను చూడవచ్చు. వీటిల్లో ఒకటి మాత్రమే కలిగి ఉంటే మాటలకే పరిమితమవుతాం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ టాప్–3లో ఉండా లన్నదే మన లక్ష్యం కావాలి. అయితే దాన్ని అందుకోవడం ఎలా అన్నదే ప్రశ్న. ఓపెన్ ఎండెడ్ అంటే నిర్దిష్ట లక్ష్యమేదీ లేకుండా పరిశోధనలు చేయడమా, లేక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరి శోధనలు చేయడమా అన్నది మనం నిర్ణయించుకోవాలి. దేశంలో మౌలిక శాస్త్ర పరిశోధనలు, అప్లైడ్ రీసెర్చ్ రెండూ వేర్వేరుగా ఎవరికి వారు చేసుకుంటున్నారు. ఈ అంతరం చెరిగి పోవాలి. ‘సైకిల్స్ ఆఫ్ ఇన్వెన్ష్షన్స్ అండ్ డిస్కవరీ’ పుస్తకంలో వెంకటేశ్ నారాయణ మూర్తి (హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ మాజీ డీన్) బేసిక్, అప్లైడ్ రీసెర్చ్ రెండింటి మేళవింపుతోనే మేలైన çసృజన సాధ్యమంటారు. ఉదాహరణకు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జన్యుక్రమ నమోదు వెయ్యి రెట్లు వేగవంతం అయ్యింది. ఎందుకంటే శంకర్ బాల సుబ్రమణ్యన్ , డేవిడ్ క్లె్లనెర్మాన్ కలిసికట్టుగా చేసిన ‘సరళమైన’ రసాయన శాస్త్ర ఆవిష్కరణ ఇందుకు దోహదప డింది. వీళ్లు అంతకుముందరి మైక్రోఫ్లూయిడ్స్, లేజర్, కంప్యూటింగ్ లాంటి సాంకేతిక విజ్ఞానం మీద ఆధారపడి ఈ పనిచేయగలిగారు. అందుకే బేసిక్, అప్లైడ్ పరిశోధనల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అన్న ప్రశ్న అర్థరహితం. ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ వేగంగా ఫలితాల నిస్తుంది. మరోవైపు మౌలిక శాస్త్ర పరిశోధనలకు ఉన్న సామర్థ్యం చాలా ఎక్కువ. మధ్య, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది భారతదేశానికి బాగా అక్కరకొచ్చే విషయం. రెండింటిపైనా పెట్టుబడులు పెట్టాలన్న దానికి రెండు వాదనలు ఉన్నాయి. తరచూ వినిపించే విమర్శల గురించి కూడా చూద్దాం. మొదటి వాదన... కీలకమైన, ఓపెన్ ఎండెడ్ పరిశోధనలపై భారత్ డబ్బు ఖర్చుపెట్టదు అన్నది. పరిశోధనలపై పెట్టే ఖర్చు గణనీయంగా పెరగాలనే విషయాన్ని మేము అంగీక రిస్తున్నాం. అయితే నిధులు సమర్థంగా ఖర్చు పెట్టడం ఎలా అన్న విష యంలో మనం ఇంకా ఎంతో పురోగతి సాధించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ నిధుల్లో సింహభాగం ప్రభుత్వ పరిశోధన సంస్థలకే వెళుతోంది. యూనివర్సిటీలకు దక్కుతున్నది కేవలం 10–15 శాతం మాత్రమే. ఈ మోతాదు అమెరికాలో 63 శాతం వరకూ ఉంటే, యునైటెడ్ కింగ్డమ్లో 80 శాతం, దక్షిణ కొరియాలో 50 శాతంఉండటం గమనార్హం. ‘ఫాస్ట్ ఇండియా’ ఇటీవల సిద్ధం చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం దేశంలోని అత్యున్నత సంస్థలు కూడా పరిపాలనపరమైన అడ్డంకుల కారణంగా పరిశోధనలకు నిధులు సేకరించలేకపోతున్నాయి. ఖర్చు కూడా పెట్టలేకపోతున్నాయి. వనరుల కేటాయింపును సమర్థంగా చేసి పరిశోధనలకు నిధులి వ్వడంలోనూ పోటీతత్వాన్ని తెస్తే ఓపెన్ ఎండెడ్ రీసెర్చ్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే కొంత కదలిక కనపడుతోంది. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించిన బడ్జెట్లో 25 శాతాన్ని డీఆర్డీఓ ప్రయోగశాలల్లో కాకుండా, యూనివర్సిటీలు, పరి శ్రమకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో వాదన గురించి... దీని ప్రకారం పాశ్చాత్య దేశాలు ఖరీదైన ఓపెన్ ఎండెడ్ రీసెర్చ్ ఇప్పటిలాగే కొనసాగించాలి. భారత దేశం ఆ పరిశోధనలను ఆవిష్కరణలుగా మార్చే ప్రయత్నించాలి. ఈ వాదన మనకు ఉపయోగపడదు. ఎందుకంటే... ఓపెన్ ఎండెడ్ పరిశో ధనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ఆయా నిర్దిష్ట అంశాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, అది కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండాలి. ఉదాహరణకు, కృత్రిమ మేధ రంగంలో 2012లోనే కీలక పరిశోధనలు జరిగినా, ఐటీ దిగ్గజంగా ఉన్నా భారత్ ఆ రంగంలోకి చెప్పుకోదగ్గ స్థాయిలో భాగస్వామి అయ్యేందుకు పదేళ్లు పట్టింది. ఎందుకంటే కృత్రిమ మేధ రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు తగినంత మంది భారత్లో లేకపోవడమే. క్వాంటమ్ కంప్యూటింగ్, న్యూరోసైన్స్, అంతరిక్షం, జన్యుశాస్త్ర రంగాల్లోనూ మనకు ఇదే రక మైన అనుభవాలు ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ పరిశోధనల్లో మన సామ ర్థ్యాన్ని పెంచుకోకపోతే మనం ఇతరులను అనుసరించే వారిగానే మిగిలిపోతాం. నేతృత్వం వహించే స్థాయికి ఎదగలేము. చివరగా... ప్రపంచ సమస్యలను భారత్ పరిష్కరించాలా అన్న ప్రశ్నను పరిశీలిస్తే... ఈ ప్రశ్న ఎక్కువగా ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ నేప థ్యంలో వస్తూంటుంది. ఇది దేశానికి ఉపయోగపడే, తొందరగా సాధించగలిగే విషయం. మన పరిశోధనలు భారత్తో పాటు అంత ర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలి. గంగానదిని సమర్థంగా శుద్ధి చేయగలిగితే... అది ప్రపంచవ్యాప్తంగా కలుషిత జలాల శుద్ధికి ఉపయోగపడుతుంది కదా! ఇలాంటి పలు అంశాలను భారతీయ శాస్త్రవేత్తలు చేపట్టాలి. ఇవి మన ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుతాయి. కె. విజయ్ రాఘవన్ , ‘ఫాస్ట్ ఇండియా’ ఛైర్మన్ ; కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; వరుణ్ అగర్వాల్, ‘ఫాస్ట్ ఇండియా’ సహ వ్యవస్థాపకుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మోదీ, అమిత్షా శాశ్వతం కాదు: విజయరాఘవన్
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ, చివరకు విపక్షాలు కూడా లేకుండా చేయాలని చూస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయరాఘవన్ మండిపడ్డారు. మోదీ, అమిత్షాలు శాశ్వతం కాదని అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవన్ మాట్లాడుతూ బీజేపీ సర్కార్ నిరంకుశ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్, అసెంబ్లీ.. తదితర ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. వామపక్షాల పాలన ఉన్నందునే అభివృద్ధి, మానవాభివృద్ధి సూచిలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. వామపక్షాల పాలన ఉండడం వల్ల భూసంస్కరణలు, భూమి పునఃపంపిణీ అక్కడ సాధ్యమైందని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న తరుణంలోనూ ఆకలి దేశంగా భారతదేశం ఉండటం శోచనీయమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ మహిళలపై ఆకృత్యాలు అధికమయ్యాయని చెప్పారు. ఈ సభల్లో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్, ఉపాధ్యక్షుడు విక్రమ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
బిచ్చగాడు 2 డైరెక్ట్ చేసేది ఆయనే: హీరో
‘‘తెలుగు ప్రేక్షకులు కోవిడ్ తర్వాత కూడా సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు. ‘క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు.. ఈ లిస్ట్లో మా ‘విజయ రాఘవన్’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని విజయ్ ఆంటోని అన్నారు. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, ఆత్మిక జంటగా నటించిన చిత్రం ‘విజయ రాఘవన్’. టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ –‘‘మదర్ సెంటిమెంట్, ప్రేమ, రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్తో ఆనంద కృష్ణన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే నా తర్వాతి సినిమా ‘బిచ్చగాడు 2’కి ఆయనకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించాను’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కమల్ బోరా, లలితా ధనంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్. విక్రమ్ కుమార్. చదవండి: రాజ్తరుణ్.. కూర్చుంది చాలులే : సమంత -
త్వరలో అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ విధానం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్స్ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ తయారీతో పాటు విద్యుత్ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు. -
చంద్రబాబు-కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే...
- బాబు బెదిరించి భూములు తీసుకుంటున్నారు. - కేసీఆర్ అభివృద్ధి పేరిట భూములను లాక్కుంటున్నారు. - టిఆర్ఎస్ ప్రభుత్వంది మాటలే చేతల్లేవ్ - ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్రాఘవన్. హిమాయత్నగర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పెద్ద తేడా ఏమీ లేదని ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్రాఘవన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు పేద రైతుల వద్ద నుంచి బెదిరించి భూములను లాక్కుంటుంటే, కేసీఆర్ అభివద్ధిని అరచేతిలో చూపిస్తూ భూములను లాక్కుంటూ పేద ప్రజలను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్రాఘవన్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, రీడిజైనింగ్లు, సచివాలయాలంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు పేదల వద్ద ఉన్న భూములను అన్యాయంగా లాక్కుంటూ కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్నారన్నారు. మల్లన్నసాగర్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన కలసి బతిమిలాడి, సభలు నిర్వహించి వారిని ఒప్పించేలా చేయాలే తప్పా వారిని బెదిరించడం సరైంది కాదన్నారు. ఈ భమూల విషయంలో 123జీఓను ప్రభుత్వాలు అనుసరించాలన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎదురించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అభివద్ధిని అదమరుస్తుందన్నారు. కేవలం మాటలే కాని చేతల్లో ఏ పనినీ చేసి చూపడం లేదన్నారు. ఒక్క రూ.వెయ్యి పించన్ మినహా ఏ ఒక్కటీ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. డబుల్ బెడరూమ్ ఇళ్లు కేసీఆర్ ఫామ్హౌస్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. నిత్యవసర ధరలు, సాగునీరు, త్రాగునీరు తదితర విషయాలపై సభలో కొన్ని తీర్మాలను చేయడం జరిగిందన్నారు. ఆ తీర్మానాలను అనుసరించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు జి.నాగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement