-
హైదరాబాద్ మియాపూర్ లో భారీ మోసం
-
హైదరాబాద్: బోర్డు తిప్పేసిన మైత్రి ప్రాజెక్ట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ పేరడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత మూడు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మబ్బి పెడుతూ కాలం గడుపుతున్నాడని బాధ్యతలు తెలిపారు. ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పుడు దాకా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్య తరగతి, పేద తరగతి వారే ఉన్నామని దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల స్పందించి వెంటనే జానీ భాషా షేక్ ను అరెస్టు చేయాలని కోరారు. చదవండి: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. -
తనఖా స్థలాలకు ‘టెన్’డర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ గ్రేటర్ వరంగల్ పెంబర్తి శివారులో దత్తాత్రేయ డెవలపర్స్ సంస్థ వేసింది. 406, 407, 408, 408/బి, 409లతో పాటు సుమారు 26 సర్వేనంబర్లలో 51 ఎకరాల్లో 363 ప్లాట్లు ‘కుడా’అనుమతితో లే అవుట్ చేసి విక్రయించారు. గుడి, బడి, పార్కులు, కమ్యూనిటీ హాల్ తదితర సామాజిక అవసరాల కోసం ఐదెకరాలు (10 శాతం) మార్టిగేజ్ చేశారు. ఎక్కడికక్కడ ప్లాట్లు అమ్ముడు పోయాక.. ఆ ఐదెకరాలను సైతం ప్లాట్లు చేసి అధికారుల సహకారంతో కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడిక్కడ ఎకరానికి మూడు నుంచి నాలుగున్నర కోట్లపైనే ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పార్కులు, ఇతర సామాజిక అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సి పాలిటీల పరిధిలో ఆయా సంస్థల తనఖాలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు కన్పించకుండా పోతున్నాయి. నిబంధనల ప్రకా రం.. లేఅవుట్ ప్లాట్ల విక్రయాల సమయం లో సామాజిక అవసరాలకు కేటాయిస్తున్న 10 శాతం భూములను.. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాస్తవంగా ఈ స్థలాలను కొనడానికి గానీ, అమ్మడానికి గానీ వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవు. కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మార్టిగేజ్ (తనఖా పెట్టిన) చేసిన ఈ స్థలాలను అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు అమ్మేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మరోవైపు మంచి లేఅవుట్ వెంచర్లో ప్లాటు కొనుక్కున్నామన్న సంబరం తీరకముందే పార్కు, బడి, గుడి, కమ్యూనిటీ హాలు వంటి సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కనుమరుగవుతుండటంతో కొనుగోలుదా రులు లబోదిబో మంటున్నారు. ఈ అక్రమ దందా వెనుక కొందరు కీలక అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనఖా స్థలాలను పరిరక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇదే వరుస రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోంది. ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పాత లేఅవుట్లలో పది శాతం చొప్పున ఉండాల్సిన స్థలాలు.. కమీషన్లకు కక్కుర్తిపడి అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల పరమయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో వెంచర్లో పది శాతం భూమిని లేఅవుట్గా చేసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉండగా.. అది మొక్కుబడిగా సాగుతోంది. నల్లగొండలోని ప్రియదర్శిని కాలనీలో 25 ఏళ్ల క్రితమే మునిసిపాలిటీ అనుమతి తీసుకుని లేఅవుట్ చేశారు. ఇందులో పార్కు కోసం ఉద్దేవించిన స్థలాన్ని 17 సంవత్సరాల క్రితమే కొందరు స్థానికులు ఆక్రమించి ఇళ్లు కట్టేసుకున్నారు. దాదాపు 30 గుంటల స్థలం ఆక్రమణకు గురైనా అప్పటి మునిసిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో 2000 సంవత్సరంలో నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఆంజనపురి కాలనీ, హనుమానగర్లో రెండు వెంచర్లు చేశారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి స్థలం కేటాయించగా హనుమానగర్ స్థలంలో అమృత్ పార్క్, టీ పార్క్ ఏర్పాటు చేశారు. కానీ ఆంజనపురి కాలనీలోని స్థలం మొత్తం అన్యాక్రాంతం అయ్యింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయల విలువైన ‘10 శాతం’స్థలాలు అన్యాక్రాంతమైనా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ‘కుడా’లో 249 అక్రమ వెంచర్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో 449 వెంచర్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు, 249 అక్రమ వెంచర్లను గుర్తించారు. కాగితాలపైన గీతలు గీసి (అక్రమ లే అవుట్), ప్లాట్లు చేసి విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.కోట్లు దండుకున్నారు. రెండు ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సుమారు 1,780 ఎకరాల్లో ఈ 249 వెంచర్లు ఉన్నాయి. అక్రమ వెంచర్లు కావడంతో వ్యాపారులు సెంటు భూమిని కూడా తనఖా పెట్టలేదు. ఫలితంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా రెగ్యులరైజ్ చేసుకునేందుకు రూ.లక్షలు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అక్రమ లేఅవుట్లు అదనం రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా చేసిన లేఅవుట్లు వీటికి అదనం. తెలంగాణ రాష్ట్రంలో 2019 నవంబర్ నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 142 ఉన్నాయి. అందులో 13 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మరొకటి. వీటి పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్ ప్రకటించింది. 2020 ఆగస్టు 26 లోపు చేసిన లేఅవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్కు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు దాదాపు 25.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.13 కార్పొరేషన్ల పరిధిలో 4,16,155, మున్సిపాలిటీల్లో 10,60,013, గ్రామ పంచాయతీల్లో మరో 10,83,394 దరఖాస్తులందడం లేఅవుట్ల తీరును స్పష్టం చేస్తోంది. స్థలాల పరిరక్షణకు ప్రహరీలు వరంగల్ మహానగరంలో దాదాపు అన్ని లే అవుట్, పార్కు స్థలాల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. లేఅవుట్ల ద్వారా సంక్రమించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ›ప్రహరీలు నిర్మించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ‘కుడా’అప్పగించిన మేరకు బల్దియా స్వాధీనంలో ఉన్నాయి. ఏమైనా కబ్జాలు ఉంటే ల్యాండ్ సర్వే ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, సిటీ ప్లానర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణ యత్నాలు అడ్డుకున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో సర్వే నంబర్లు 300 నుంచి 303, 306, 311, 313 నుంచి 315 వరకు ఉన్న దాదాపు 14 ఎకరాల్లో 1990లో అరుణోదయ హౌసింగ్ సొసైటీ పేరుతో హెచ్ఎండీఏ అనుమతితో (ఫైల్ నంబర్ 3030/ఎంపీ2/హెచ్ఎండీఏ/91) లే అవుట్ చేశారు. ఏజీ ఆఫీసు ఉద్యోగులు అప్పట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి అనుబంధంగా మరిన్ని లే అవుట్లు వచ్చి సమతానగర్, సాయిరాంనగర్ కాలనీలుగా (నార్సింగి హైట్స్) కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అప్పట్లో నాలుగు చోట్ల పార్కుల కోసం, మరోచోట సెప్టిక్ ట్యాంక్ కోసం 6,070 గజాల స్థలాన్ని వదిలి నార్సింగి గ్రామ పంచాయితీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు అడ్డుకుని ఆక్రమణలను తొలగించారు. -
సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: సర్కారు భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న భూమిని అంచనా వేసి లేఅవుట్లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు. రెండుచోట్ల వెంచర్లు.. ప్రభుత్వ భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల లేఅవుట్లు వేయనున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ లే అవుట్లకు తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్లో మండలం పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు అన్యాక్రాంతం కాగా, మిగతా 90 ఎకరాల భూమి కొద్ది రోజల క్రితమే హెచ్ఎండీఏ చేతికి వచ్చింది. మోకిలలో హెచ్ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్లైన్ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనతో మరోసారి హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్ భగాయత్లో మరో 40 ఎకరాలలో లే అవుట్ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్లాట్లు చేసి విక్రయించనున్నారు. కరువైన రక్షణ.. హెచ్ఎండీఏ భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్నగర్లో సుమారు 2300 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్లోనూ వెయ్యి ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్నగర్, మియాపూర్లలో రెండు చోట్ల పేదల పేరుతో ఆక్రమించుకొని కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్లో 60 ఎకరాలు, కోకాపేట్లో 60, కొత్వాల్గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్లో 300 ఎకరాల వరకు హెచ్ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి. -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement