-
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
6 నెలల్లో 20 లక్షల వాహన విక్రయాలు
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. ప్యాసింజర్ విభాగంలో మొత్తం 20 లక్షల వాహనాలు విక్రమయ్యాయి. ఇక నెలవారీగా జూన్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. మొత్తం 3.37 లక్ష వాహన అమ్మకాలు జరిగాయి. ఏడాది ఇదే నెలలో సరఫరా చేసిన 3.21 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 1.9% మాత్రమే అధికంగా ఉంది. కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్.. అమ్మకాల్లో ఓ మోస్తరు వృద్ధి నమోదైంది. ► మారుతి సుజుకీ జూన్లో మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలి్చతే కేవలం ఎనిమిది శాతం (1,22,685 యూనిట్లు) వృద్ధి నమోదైంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాల్లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ ఈ కాలంలో 50,001 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ► టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంజీ మోటార్, టాటా మోటార్స్ విక్రయాలు వరుసగా 19%, 14%, ఒక శాతం పెరగగా కియా, హోండా కార్ల విక్రయాలు మాత్రం వరుసగా 19%, 35% మేరకు క్షీణించాయి. -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
మారుతీ మినీ ఎస్యూవీ.. ఎస్–ప్రెసో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), ఎస్–ప్రెసోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్ ధరలు)లో ఉన్నాయి. స్టాండర్డ్తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్, డాట్సన్ రెడీ–గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్–ప్రెసో గట్టి పోటీనిస్తుందని అంచనా. ఎనిమిదవ బీఎస్–సిక్స్ మారుతీ మోడల్ మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్టెక్ ప్లాట్ఫామ్పై రూపొందిన ఈ కారు లీటర్కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్(భారత్ స్టేజ్)–సిక్స్ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్ కే10 పెట్రోల్ ఇంజిన్తో ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్–సిక్స్ ఇంజిన్తో వస్తున్న ఎనిమిదవ మోడల్ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్(5 గేర్లు), ఆటో గేర్ షిఫ్ట్(ఏజీఎస్) ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు. వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ–లాక్బ్రేకింగ్ సిస్టమ్) లిమిటర్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, హైస్పీడ్ వారి్నంగ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్ చాంబర్ హెడ్ల్యాంప్స్, సిగ్నేచర్ సి షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఓఆర్వీఎమ్స్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఆడియో, వాయిస్ కంట్రోల్స్తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–అంగుళాల స్మార్ట్ప్లే స్టూడియో టచ్్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. రూ. 640 కోట్ల పెట్టుబడులు... ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్ను మార్చడానికి ఎస్–ప్రెసో తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాంపాక్ట్ కార్లకే మొగ్గు.... ఇటీవలి కాలంలో వినియోగదారులు కాంపాక్ట్ కార్ల కొనుగోలుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్–ప్రెసో కారును అందుబా టులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్ కార్ల డిజైన్కు ఎస్–ప్రెసో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. -
రోడ్లపై కార్ల జోరు!
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ♦ దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి. ♦ ‘జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియా మ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. ♦ యుటిలిటీ వెహికల్స్, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి. ♦ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి. ♦ మోటార్ సైకిల్ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి. ♦ స్కూటర్ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్సైకిల్ దేశీ స్కూటర్ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్ మోటార్స్ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి. ♦ వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement